వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పార్టీలో  నమ్మినబంటు ఎవరు అంటే టక్కున గుర్తొచ్చేది విజయసాయిరెడ్డి. ప్రస్తుతం పార్టీలో కీలక నేతగా వైసీపీ పార్లమెంటరీ నేత గా ఉన్నారు విజయసాయిరెడ్డి. ఇక ఎప్పుడు విజయసాయిరెడ్డి ప్రతిపక్షాల పై ఘాటైన విమర్శలు చేస్తూ.. ప్రతిపక్షాల తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ  ఉంటారు విజయసాయిరెడ్డి. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎన్నో వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు . ప్రతి విషయం పై స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీ తీరును ఎండగడుతూ ఉంటారు

 


 అయితే ప్రతిపక్ష పార్టీపై  విజయసాయిరెడ్డి పెట్టె  పోస్టులపై కొందరు వెటకారం  చేస్తూ ఉంటారు. ఐఏఎస్ అయిన విజయ్ సాయి రెడ్డి స్థాయి ఏంటి లోకల్ లీడర్ లా  ఆయన మాట్లాడుతున్నది ఏంటి అంటూ ఉంటారు. అయితే  విజయసాయిరెడ్డి పోస్టు ద్వారా తనలోని మాస్ లీడర్ కొన్ని కొన్ని సార్లు బయటికి వస్తూ ఉంటాడు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక తాజాగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. 


 ప్రస్తుతం లాక్ డౌన్  సందర్భంగా పేద ప్రజలకు సహాయం చేసేందుకు అధికార పార్టీ నేతలు కొన్ని సరుకులు  చందాలను  స్వచ్ఛందంగా వసూలు చేస్తూ పేద ప్రజలకు పంచుతున్నారు. దీనిపై టిడిపి నేతలు సహా చంద్రబాబు నాయుడు చందాలను బలవంతంగా వసూలు చేస్తున్నారు అంటూ కామెంట్ చేశారు. ఇక దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టారు. చంద్రబాబు చందాలు దందాలు అంటూ నాపై ఆరోపణలు చేశారు. మీ ఆస్తులు నా ఆస్తులపై సిబిఐ విచారణ కోరుతూ లేఖలు రాద్దాం  పిటిషన్లు వేద్దాం.. ఖచ్చితంగా విచారణ జరిగేలా  చూద్దాం రెడీనా అంటూ సోషల్ మీడియా వేదికగా విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే... ఇలాంటి వ్యాఖ్యలు కేవలం చాలెంజ్ లు  విసురుకోవడానికి  మాత్రమే పరిమితమవుతాయి అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: