ప్రేమ అనేది ఎంత కఠినమైనది అన్న విషయం తెలిసిందే.. అంతకు మించి ప్రేమను కలిగి రెండు మనసులను దగ్గరకు చేర్చుకుంది...భార్య భర్తల మధ్య అనేది అపురపమైన బంధం.. అర్థం చేసుకుంటే ఆ బంధం చక్కగా నడుస్తుంది.. కానీ ఒక్కసారి అనుమానం అనేది మొదలైతే మాత్రం అంతకు మించిన ఊహా మరొకటి ఉండదు.. అలాంటి అనుమానం కారణంగా ఓ చేసిన పని ఇప్పుడు అందరిలో కలకలం రేపుతోంది..




 

 

వివరాల్లోకి వెళితే.. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేసిన భర్త హైడ్రామాకు తెరతీశాడు. భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని నమ్మించాడు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ కోసం వేచిచూశారు. తీరా ఖాకీల అనుమానమే నిజమైంది. పోస్టుమార్టం రిపోర్ట్‌లో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో వెలుగుచూసింది.




 

 

భోపాలపట్నం మండలం భట్టపల్లికి చెందిన కామేశ్వర్ దుర్గం భార్య భాగ్య శ్రీ(22) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోనే ఉరికి వేలాడుతూ కనిపించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీంని పిలిపించి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు.




 

 

కొంతకాలంగా భార్య మీద అనుమానంతో ఉన్న భర్త గొడవకు దిగాడు.. అనంతరం గొడవ పెద్దది కావడంతో కోపుద్రుడైన భర్త గొంతు నులిమి చంపేశాడు.. అనంతరం ఆమె శవాన్ని ఉరికి వేలాడదీసి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు భోపాలపట్నం పోలీసులు తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.అతన్ని రిమాండ్ కు పంపనున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: