తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషనల్ దర్శకుడు గాని కొనసాగుతున్నారు రాంగోపాల్ వర్మ. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఎన్నో సినిమాలు టాలీవుడ్ లో సెన్సేషన్ విజయాలను నమోదు చేశాయి. అంతే కాకుండా ఎంతో మంది హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను ఇచ్చాడు రాంగోపాల్ వర్మ. ఇక ఎన్నో వివాదాస్పద సినిమాలను కూడా తెరకెక్కించి వివాదాస్పద దర్శకుడిగా గుర్తింపు సంపాదించారు. ముక్కు సూటిగా మాట్లాడే రాంగోపాల్ వర్మ... మాటలతో కూడా ఎంతో మందిని ఆకర్షించాడు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు ఉన్న వర్మ కి ఉన్న క్రేజ్ మాత్రం ప్రత్యేకం. 

 

 

 ఒకప్పుడు వివిధ జోనర్ లలో సినిమాలు తెరకెక్కించిన రాంగోపాల్ వర్మ ప్రస్తుతం వివాదాస్పద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ముఖ్యంగా రాజకీయ ప్రముఖులకు సంబంధించిన సినిమాలను తెరకెక్కిస్తు  నిజాలు చెబుతున్నాను అంటూ ఎన్నో వివాదాస్పద సినిమాలు తెరకెక్కిస్తున్నాడు వర్మ . ఇక వీటికి ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో చేసేస్తున్నాడు రాంగోపాల్ వర్మ, తనదైన స్టైల్లో ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై మరింత హైప్ తీసుకోస్తున్నాడు. కానీ ఒకప్పుడు వరుస విజయాలతో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు ఇప్పుడు మాత్రం ఆ తరహా విజయాన్ని అందుకోలేక పోతున్నాడు. 

 

 

 అయితే మొన్నటికి మొన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే ఒక వివాదాస్పద సినిమాని.. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే మరో వివాదాస్పద సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో అటు ఆంధ్ర రాజకీయాల్లో అల్లకల్లోలంగా జరిగింది. అయితే ఒకానొక ఇంటర్వ్యూలో వర్మ తనకు వచ్చిన వార్ణింగ్ ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇన్ని  వివాదాస్పద సినిమాలను  తెరకెక్కించారు కదా ఎవరైనా వార్నింగ్ ఇస్తే  ఏం చేస్తారు అన్న ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.. తనకు ఇప్పటి వరకు చాలానే వార్నింగ్ లు వచ్చాయని అవన్నీ పట్టించుకోను. మరీ అంతగా ఇవ్వాల్సి వస్తే నేను కూడా వాళ్ళకి వార్నింగ్  ఇస్తాను అంటూ చెప్పుకొచ్చాడు రాంగోపాల్ వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: