ట్విట్టర్ వేదికగా టిడిపి అధినేత చంద్రబాబు పైన, ఆయన కుమారుడు లోకేష్ పైన వ్యంగ్యాస్త్రాలు విసరడం లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారందరిపైన ఇదేవిధంగా విజయ్ సాయి రెడ్డి పంచ్ డైలాగులతో విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కరోనా వ్యవహారంలో అదే పనిగా టిడిపి అధినేత చంద్రబాబు విమర్శలు చేస్తూ ఉండటం, లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తుండడంతో వాటికి విజయసాయి రెడ్డి తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా ప్రతివిమర్శలు చేస్తూనే ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు కూడా చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ ను ఉద్దేశించి  ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. 

 


''మై డియర్ పప్పు అండ్ తుప్పు భౌతిక దూరం పాటించడం అంటే భౌతికంగా (రాష్ట్రానికి) దూరం కావడం కాదు. ఇటలీ లో ఉన్న పిల్లలు, గుజరాత్ లో ఉన్న జాలర్లు, వేరే రాష్ట్రాల్లో ఉన్న కూలీలు కూడా వచ్చేశారు. పప్పు అండ్ తుప్పు మీరు మాత్రం కరోనా టీకా  వచ్చేవరకు ఇల్లు కదలం అంటున్నారు'' అంటూ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డి ట్విట్ల కు సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ కనిపిస్తోంది. విజయసాయిరెడ్డి ట్విట్లను కోడ్ చేస్తూ అనేక వ్యంగ్యాస్త్రాలను తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు, లోకేష్ పైన ట్రోలింగ్ లు చేస్తున్నారు.

 

ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు వెసులుబాటు దొరికిందని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రవాసంలో ఉన్న తుప్పు, పప్పులకు ఇది చక్కని అవకాశం. లాక్ డౌన్ సాకులు చెప్పే వీలు కూడా లేదు. వ్యాక్సిన్ వచ్చేదాకా అడుగుపెట్టేది లేదంటే శాశ్వతంగా అక్కడే ఉండిపోవలసి వస్తుంది మీ ఇష్టం. అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: