ఈ మధ్య కాలంలో సమాజంలో జరిగే ప్రతి విషయం పై సోషల్ మీడియా ప్రభావం ఎంతగానో పెరిగింది అనే విషయం తెలిసిందే . సందర్భం ఏదైనా సమయం ఏదైనా విషయం ఏదైనా సోషల్ మీడియా మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎప్పుడు ఎదో ఒక విషయం మీద సెటైర్లు వైరల్ అవుతూనే ఉంటాయి . ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాను వాడుతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు ఎక్కువవుతోంది.ఈ తరుణంలో.. ప్రతి అంశంపై సోషల్ మీడియా ప్రభావం బాగా కనిపిస్తోంది. పోస్టుల్లో కామెంట్లు అంటూ మొత్తం సోషల్ మీడియానే ఊపేస్తున్నారు.
కొన్ని పోస్టులు నవ్విస్తూ ఉంటే కొన్ని పోస్టులు చిరాకు తెప్పిస్తున్నాయి.చిత్ర విచిత్రమైన పోస్ట్ లు మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు కూడా మద్యం షాపులకు గురుంచి సోషల్ మీడియాలో ఎన్నో సెటైర్లు హల్చల్ చేస్తూనే ఉన్నారు. కరోనా వైరస్ ప్రభావం కారణంగా దాదాపు 45 రోజుల తర్వాత సోమవారం అనగా ఈరోజు మద్యం షాపులు తెరుచుకున్నాయి. మద్యం షాపులు తెరుచుకున్నాయి లేదో అప్పుడే సోషల్ మీడియాలో మద్యం షాపుల గురించి మీమ్స్ మొదలయ్యాయి. ఇందులో కొన్ని కోపం తెప్పించేవి అయితే కొన్ని నవ్వు తెప్పించేవి ఇలా రకరకాల మీమ్స్ ప్రస్తుతం మద్యం షాపుల గురించి వస్తున్నాయి .
ఇక ఈ రోజు వస్తున్న మీమ్స్ ఏమిటి అంటే మద్యం షాపులు తెరుచుకోవడంతో మందుబాబులు అందరూ మద్యం షాపుల వద్ద బారులు తీరారు. అంతేకాకుండా గ్రీన్ జోన్ లో మద్యం షాపులు తెరుచుకోగా రెడ్ జోన్ మాత్రం మద్యం షాపుల తెరుచుకున్న దాఖలాలు లేవు. దీంతో గ్రీన్ జోన్ లో ఉన్నవారు రెడ్ జోన్ లో ఉన్న వారిని ఎద్దేవా చేస్తున్నట్టుగా కొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి . మరోవైపు మొన్నటి వరకు కరోనా వైరస్కు భయపడిన వారు కూడా ఇప్పుడు వైరస్ కు భయపడకుండా గుంపులు గుంపులుగా మద్యం షాపుల దగ్గర కనిపిస్తున్న మీమ్స్ కూడా వస్తున్నాయి. ఇలా రకరకాల మీమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి