పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలకు కేరాఫ్ అడ్రస్ అయిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులను తయారు చేసేది పాకిస్తాన్ దేశమే... ఉగ్రవాదులను సమరయోధుడిగా అభివర్ణించింది పాకిస్తాన్ దేశమే . ఎప్పుడు భారతదేశంపై దండెత్తి ఎలా ఎప్పుడూ ఉగ్రవాదులను పంపించి దాడులు జరిపించాలా అని సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పాకిస్థాన్ . అలాంటి పాకిస్తాన్ ప్రస్తుతం కరోనా వైరస్ విషయంలో మాత్రం చాలా నీచంగా వ్యవహరిస్తోంది. కరోనా కు సంబంధించిన బాధితులను కాపాడడానికి పాకిస్తాన్ కి చేతకాక.. అక్కడ జైలు లో ఉన్నటువంటి వాళ్లందరినీ వదిలేస్తుంది. జైల్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్లో అందరూ.. భారత్ పై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు కూడా ఇందులో ఉన్నారు.
హఫీజ్ సయ్యద్ అనేటువంటి ఉగ్రవాదిని తాజాగా విడిచిపెట్టేస్తోంది పాకిస్తాన్. ప్రపంచ దేశాల క్షేమం కోసం మేము ఉగ్రవాదులను కంట్రోల్ చేస్తున్నామంటూ గతంలో ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్. పింక్ లిస్టులో ఉన్న తాను బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లకుండా ప్రపంచ దేశాలు మొత్తం పాకిస్తాన్ ని పక్కన పెట్టకుండా ఉండేందుకు ఇలాంటి మాటలు చెప్పింది పాకిస్తాన్. అందుకే వాళ్ళని తీసుకుని లోపల పెట్టాము అంటూ చెప్పింది పాకిస్తాన్..
కానీ ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాప్తి చెందతుంది కాబట్టి హఫీస్ సయ్యద్ లాంటి వాళ్లను కాపాడలేమని చేతులెత్తేసి విడిచి పెడుతున్నాము అంటూ విడిచి పెట్టింది. సుమారు 50 మంది ఉగ్రవాదులకి వైరస్ సోకింది అనే కారణంతో.... వదిలేసినట్లు వదిలేసినట్లు స్వయంగా లాహోర్లోని ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. మరి జైలు లో ఉన్నటువంటి వ్యక్తి కి వైరస్ ఎలా జరిగింది ఎందుకు దానికి మూలాలు ఏమిటి... అని తెలుసుకోకుండా వదిలిపెట్టడం ఏమిటి అని విశ్లేషకులు మండిపడుతున్నారు. ఇక మరిన్ని వివరాల కోసం ఈ కింది వీడియో క్లిక్ చేయండి.