దేశ వ్యాప్తంగా కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా విధించారు.. అయిన కరోనా ప్రభావం మాత్రం పెరుగుతూ వస్తుంది.. దీంతో ప్రభుత్వం కూడా స్పందించి కరోనా పై ముమ్మర చర్యలు తీసుకుంటూ వస్తుంది.. అలాగే లాక్ డౌన్ పేరుతో ప్రజలను ఇళ్లకే పరిమితమయ్యే లా చేసింది.. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు..
ఈ మేరకు ప్రజల ఆకలిని తీర్చడానికి దాతలు ముందుకు వస్తున్నారు.. లాక్ డౌన్ పొడిగిస్తూన్న నేపత్యంలో ఎవరికి తోచిన సాయాన్ని వారు అందజేస్తున్నారు... అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆదేశాలను కూడా పాటిస్తూ వస్తున్నారు... లాక్ డౌన్ లో అనవసరంగా రోడ్ల మీదకు వస్తె పోలీసులు కూడా తమ స్టయిల్లో జవాబు చెబుతున్నారు..మరొక విషయమేంటంటే వినని వాళ్లకు క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు...
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. లాక్డౌన్ సమయాన్ని ఎలా గడుపుతున్నాడో తెలియజేస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, తనకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టమని, ఖాళీ సమయం దొరికినప్పుడల్లా బైక్ రైడింగ్ చేస్తుంటానంటూ.. పలు ఇంటర్వ్యూల్లో ధోనీ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాంచీ శివార్లలో ఉన్న తన ఫామ్హౌస్లోనూ.. బైక్ రైడింగ్ చేస్తూ లాక్డౌన్ సమయాన్ని గడుపుతున్నాడు ధోనీ.
తన కూతురు జీవాతో కలిసి ధోనీ బైక్ రైడింగ్ చేస్తుండగా తీసిన వీడియోను.. ధోనీ భార్య సాక్షి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అలాగే, విలాసవంతమైన ఫామ్ హౌస్ అందాలను వీడియోలో చూపకనే చూపింది సాక్షి. వివిధ రకాల మొక్కలు, చెట్లతోపాటు, వేర్వేరు జాతుల పక్షులతో మరో ప్రపంచంలా కనిపిస్తోంది ధోనీ ఫామ్ హౌస్. ఇంక ధావన్ విషయం గురించి చెప్పాల్సిన పనిలేదు.. పెళ్ళాం చెప్పిన పనులను తూచా తప్పక చేస్తున్నారు..కోహ్లీ కూడా ధావన్ ను ఫాలో అవుతూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు..