భార్య భర్తలు అన్నాక గొడవలు సహజం. వాస్తవంగా చెప్పాలంటే గొడవలు లేని భార్యాభర్తలు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. చాలా మటుకు గొడవలు జరుగుతూనే ఉంటాయి... మళ్లీ సర్దుకుపోతూనే ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు జరిగిన గొడవలు మాత్రం ప్రాణాల మీదకు తెస్తు ఉంటాయి . మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు కొన్ని సార్లు జరిగిన ఘటనల ద్వారా అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఆటపట్టిద్దాం  అనుకుంటే అది కాస్త ప్రాణాల మీదికి వచ్చి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాంటి ఘటనే జరిగింది ఇక్కడ.... తన భార్యను కాపురానికి రావాలని బెదిరించాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఉరి వేసుకున్నట్లు నటించబోయాడు  ఓ భర్త... కానీ చివరికి గాచారం  కాస్త గాడి తప్పి అతని ప్రాణాలు పోయాయి.. 

 

 

 ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కువైట్ లో ఉన్న తన భార్యను స్వస్థలానికి రావాలని భర్త పలుమార్లు కోరాడు. భార్య మాత్రం ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ రాకపోవడంతో తాను ఉరేసుకుంటునట్లు  భార్య ను బెదిరించపోయాడు... కానీ చివరికి ఈ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు భర్త. పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది ఈ దుర్ఘటన. వివరాల్లోకి వెళితే... పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ విషాద ఘటన. తాళ్లపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో మలకపల్లి కి చెందిన జి గణేష్ అనే వ్యక్తి భార్య బతుకుదెరువు కోసం ఐదు నెలల క్రితం కువైట్ వెళ్ళింది. 

 

 

 అక్కడే ఉపాధి చూసుకొని ఉద్యోగం చేస్తుంది గణేష్ భార్య. ఈ క్రమంలోనే తన భార్యను ఇంటికి వచ్చేయాలి అంటూ భర్త గణేష్ పలుమార్లు కోరాడు. ఎన్నిసార్లు భర్త ఇంటికి రావాలి అని చెప్పినప్పటికీ భార్య మాత్రం రాకపోవడంతో... భార్యను రప్పించడానికి ఒక ప్లాన్ వేసాడు... ఆదివారం రాత్రి ఉరి వేసుకున్నట్లుగా తన భార్యను బెదిరిస్తే ఇంటికి వస్తుందని భావించాడు. ఈ క్రమంలోనే తాడును ఫ్యాన్కు గట్టిగా బిగించాడు.. వీడియో కాల్ చేస్తూ తన భార్యను ఇంటికి రావాలి అంటూ బెదిరించడం మొదలుపెట్టాడు.. ఇంతలో ప్రమాదవశాత్తు మెడకు తాడు బిగించి ఉంచడంతో గణేష్ మృతి చెందాడు. ఇదంతా సెల్ఫీ వీడియో లో నిక్షిప్తమై ఉంది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: