అనుమానం పెను భూతం అయ్యి కట్టుకున్న భార్య ను ఓ భర్త ప్రాణాలు తీసే వరకు వెళ్ళింది..దీంతో కిరాతకం గా చంపేసిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. గోనెగండ్ల మండలంలోని పెద్దనేలటూరు గ్రామానికి చెందిన చాకలి సూరికి అదే గ్రామానికి చెందిన అడివమ్మతో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరు కుల వృత్తితో పాటు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న సూరి ఆమెను వేధిస్తున్నాడు.

 

 

 

 

ఆ అనుమానంతో నే తన భార్యను రోజు హింసించేవాడు.. అంతేకాక తరచూ గొడవ పడుతుందేవాడు..ఎంతగా పెద్దవాళ్ళు సర్ది చెప్పిన కుడా అతను వినేవాడు కాదు .. గ్రామంలోని పలువరు వ్యక్తులతో ఆమెకు అక్రమ సంబంధాలు అంటగట్టి హింసించేవాడు.దీనిపై ఇటీవలే పెద్దల మధ్య పంచాయతీ కూడా జరిగింది. అప్పటినుంచి సూరి భార్యతో సఖ్యతగానే ఉన్నాడు. అయితే ఇటీవల ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్లాలని సూరి నిర్ణయించుకున్నాడు. అయితే తాను ఊరు విడిచి రానని అడివమ్మ భర్తకు తెగేసి చెప్పింది. 

 

 

 

ఈ మేరకు సూరి ఒక్కడే భార్యను వదిలేసి పనుల కోసం వేరే ఊరికి వలస వెళ్ళాడు..అప్పుడప్పుడు ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలోనే భార్య ప్రవర్తనపై అతడికి అనుమానం రెట్టింపైంది.అక్రమ సంబంధం కోసమే భార్య ఊరు విడిచి వచ్చేందుకు నిరాకరించిందని బలంగా నమ్మాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో సూరి ఆగ్రహానికి గురయ్యాడు. ఆవేశంతో భార్య గొంతు నులిమాడు. ఊపిరాడకపోవడంతో అడివమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సూరి వెళ్లి పోలీసుల ముందు లొంగీ పోయాడు..మృతురాలు తండ్రి పిర్యాదు  మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: