ఈ మనుషులు రోజు రోజుకు ఎంత విచిత్రంగా మారుతున్నారు.. అందులో మద్యం తాగిన వారి గురించి చెప్పవలసిన అవసరం లేదు.. ఎందుకంటే తాగితే మనిషి కోతి కావచ్చూ, మృగం కావచ్చూ.. అసలు మనుషులు కొందరు మద్యం తాగకుండానే రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు.. అలాంటిది వారి మెదడు మత్తుతో నిండిపోయిందంటే మానవత్వానికి అర్ధానే మార్చేస్తారు.. మంచితనానికి ముసుగేసి పడుకోబెడతారు.. అందుకే పెద్దలు తాగితే తల్లి పెళ్లాం అవుతుందని అన్నారు.. అంటే ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఏం చేస్తాడో తాగిన వాడికే తెలియదు..

 

 

ఇదంతా పక్కన పెడితే నలబై రోజుల తర్వాత మందు ప్రేమికుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది.. ఎందుకంటే కేంద్రం మద్యం అమ్మకాలు చేయవచ్చని ఆదేశాలు జారి చేసింది.. ఇక మందులేక ముఖం వాచిపోయిన తాగుబోతులు దొరికిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు.. ఇలాగే ఓ వ్యక్తి ఫుల్‌గా మద్యంతాగి నాగుపామును మంచింగ్‌లా నంజుకున్నాడు.. ఈ వివరాలు తెలుసుకుంటే.. కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో  ఓ మందు బాబు పీకలదాక తాగి తన బండిపై నాగిని డ్యాన్స్ చేసుకుంటూ వెళ్లుతుండగా అతనికి దారిలో ఒక త్రాచుపాము ఎదురైయ్యింది. అప్పటికే నిషా నషాళాని అంటగా.. తలదాకా ఎక్కిన కిక్కు ఏదో ఒకటి చేయమని ఆదేశాలు పంపగా.. ఇతడు ఊరుకుంటాడా, అక్కడ ఉన్నది విష సర్పం అన్న విషయాన్ని కూడా మరచి దాని చేతిలోకి తీసుకుని.. నాతో పెట్టుకుంటావా.. అని అనుకుంటూ  ఆ పామును పట్టుకుని ముక్కలు ముక్కలుగా కొరికి పారేశాడు.

 

 

ఇతని దుశ్చర్యను చూస్తున్న వారందరు ఆశ్చర్యంతో, భయంతో కొయ్యబారిపోయారు.. ఇదిలా ఉండగా సోమవారం నుంచి మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులివ్వడంతో దేశవ్యాప్తంగా మందుబాబులు తెగ హల్‌చల్ చేస్తున్నారు. నెలరోజుల నుంచి కాచుకుకూర్చున్న రోజు రానే రావడంతో పూటుగా తాగి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు... ఈ బిగినింగ్ స్టోరీలోనే మందుబాబుల పరిస్దితి ఇలా ఉంటే ఇక ముందు ముందు ఎలా ఉంటుందో.. ఇంకా ఎన్ని దారుణాలు చేస్తారో అని నెటిజన్స్ ముచ్చటించుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: