ఒకవైపు తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మరో వైపు హత్యలు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న విషయానికి సంబంధం లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు అవి కారణాలే కాదు... చిన్న చిన్న వాటికి కూడా కొందరు తొందరపడి అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. క్షణాల్లో ఆవేశంతో ఆత్మహత్య లాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఈ సంఘటనని కడప జిల్లాలో చోటు చేసుకుంది. 

 


ఇక అసలు విషయానికి వస్తే... జిల్లాలోని బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మేదర కాలనీలో టీవీ రిమోట్ కోసం చెల్లెలితో గొడవ పడిన అక్క... ఊహించని దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక అక్క చెల్లెళ్ళ మధ్య చిన్న గొడవ ఒక నిండు ప్రాణం బలి తీసుకుంది. ఆ గొడవలో తీవ్ర మనస్తాపం చెందిన అక్క సాయి లక్ష్మి... ఆవేశంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇక ఉరి కి వేలాడుతున్న తన కన్న కూతురిని చూసి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. చిన్న కారణంతో ఆవేశంలో ఉరి వేసుకొని కన్నవారికి కడుపుకోత మిగిల్చి వెళ్లిపోయింది. 

 


ఇక ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత కేసు దర్యాప్తులో తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అధికారులు. ఆ తర్వాత బాలిక డెడ్ బాడీని పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక ఈ ఘటనపై పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ దెబ్బతో వారి ఇంట్లో విషాద ఛాయలు తారస్థాయికు చేరాయి. నిజానికి ఇలాంటి చిన్న సంఘటనలకు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం ఎంతవరకు కరెక్టో ...!

మరింత సమాచారం తెలుసుకోండి: