ఉగ్రవాదులు ఎప్పుడు భారతదేశంపై ఎలా దాడి చేయాలి అనేదాని గురించి ఆలోచిస్తూ ప్లాన్ సిద్ధం చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఇలా ఉండే వాళ్లలో తెర వెనుక ఉండే వాళ్ళు తెర ముందు ఉండే వాళ్ళు అంటూ ఇద్దరు ఉంటారు. తెర ముందుకొచ్చినటువంటి వాళ్ళు పేదరికం నుంచి దరిద్రంగా నుండి వస్తే వారికి మతపరంగా రెచ్చగొట్టి బోధించి పంపి భారతదేశంలో ప్రజల ప్రాణాలు తీస్తే దేవుడి ఆశీస్సులు లభిస్తాయి అని చెప్పడం అంతేకాకుండా వారి పేదరికానికి కాసింత ఆర్థిక సహాయం చేయడం చేస్తారు . ముఖ్యంగా లక్ష రూపాయలకు కూడా ప్రజల ప్రాణాలు తీస్తారు అనడానికి సజీవమైన సాక్ష్యం కసబ్.
కసబ్ భారతదేశంలో ఎంతగానో విధ్వంసం సృష్టించాడు కానీ అతను సృష్టించిన విధ్వంసానికి వారి కుటుంబానికి ఇచ్చింది కేవలం లక్ష రూపాయలు మాత్రమే. ప్రస్తుతం ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే... హిజ్బుల్ ముజాహిదీన్ కి గ్రౌండ్ వర్క్ చేస్తూ కీలక సమాచారం అందిస్తూ ఉన్నటువంటి... శకీలక ఏజెంట్ ని తన్వీర్ అహ్మద్ ఆలీని నిన్న ఇండియన్ ఆర్మీ ప్రాణాలతో పట్టుకుంది. ఇతన్ని జమ్మూకాశ్మీర్లో అరెస్ట్ చేశారు ఇండియన్ ఆర్మీ. గత పది సంవత్సరాల నుంచి పలు కీలక సమాచారాన్ని ఇజిబుల్ ముజాహిద్దీన్ కి అందిస్తున్నారు ఈ వ్యక్తి.
అంటే సైన్యం ఏ రూట్ నుంచి వెళ్తుంది.. ఏ రోజున ఎంత మొత్తంలో సైనికులు వెళుతూ ఉంటారు. అక్కడి సైనికులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి అందించడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఇక ఈ కీలక సమాచారాన్ని అందుకున్న పాకిస్తాన్ లో ఉండే ఉగ్రవాదులు దాడులు లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇండియా లో జరుగుతున్న దాడులకు కీలకంగా గ్రౌండ్ వర్క్ నడుపుతున్న వ్యక్తి ఇతనే అని తాజాగా తేలింది. కాగా ప్రస్తుతం ప్రాణాలతో దొరికిన ఈ వ్యక్తి నుంచి ఎలాంటి కీలక సమాచారాన్ని ఇండియన్ ఆర్మీ రాబడుతుందో చూడాలి మరి.