తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ కరోనా వైరస్ కట్టడి చేయడంలో తీవ్రస్థాయిలో కష్టపడుతూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి పూర్తి సమాచారాన్ని అందిస్తూ జాగ్రత్తలు సూచిస్తున్నారు. దాదాపు వన్ మాన్ ఆర్మీ అన్నట్టుగా కే‌సి‌ఆర్ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విషయంలో ఒకపక్క ప్రజలకు ధైర్యం చెబుతూనే మరోపక్క ప్రభుత్వపరంగా చర్యలు చేపట్టడం జరిగింది. ఇదే సమయంలో ప్రతిపక్షాలకు అదేవిధంగా తనపై తన ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే విధంగా వ్యవహరించిన మీడియాలకు అదిరిపోయే రేంజ్ లో కౌంటర్లు వేయడం జరిగింది.

 

ఇటువంటి సందర్భంలో ఇద్దరు ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా పనిచేసే మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా వైరస్ తో రాబోయే రోజుల్లో కలిసి బతకాలని మొన్న చేసిన వ్యాఖ్యలు పై నానా రాధంతం చేయడం మనకందరికీ తెలిసినదే. దీంతో వైయస్ జగన్ పై తీవ్ర స్థాయిలో బాబోరు మీడియా, చంద్రబాబు మరియు పార్టీ నాయకులు చేతగాని ముఖ్యమంత్రి అంటూ జగన్ ని విమర్శలు చేశారు. ఇదే సమయంలో తాజాగా కే‌సి‌ఆర్ నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ నోట్లో నుంచి వచ్చిన సేమ్ మాట రావటంతో యూట్యూబ్ లో వ్యూస్ దద్దరిల్లాయి.

 

కే‌సి‌ఆర్ కూడా భవిష్యత్తులో కరోనా వైరస్ తో బతకాల్సిందే అని ఇటీవల మీడియా సమావేశంలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇద్దరి నోటా ఒకే మాట రావటంతో సోషల్ మీడియాలో ఇద్దరి స్పీచ్ ఎడిట్ చేసి యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయడంతో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. మరోపక్క ఇదే మాటను ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ అదేవిధంగా అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్త తో పాటు అమెరికాలో ఓ రాష్ట్ర గవర్నర్ ఈ విధంగానే రాబోయే రోజుల్లో కరోనా వైరస్ తో బతకాలని, జాగ్రత్తలు తీసుకోవటమే మన చేతుల్లో ఉందని తెలపడం జరిగింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: