విశాఖ లో ఉన్న ఎల్జి పాలిమర్స్ కంపెనీ అక్కడి ఐదు గ్రామాల ప్రజల ప్రాణాల మీదికి తెచ్చింది. ఎల్జీ  పాలిమర్స్ కంపెనీ నుండి వెలువడిన విషవాయువు కారణంగా చాలామంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లవారుజామున ఒక్కసారిగా విషవాయువు  వ్యాప్తి చెందడంతో ప్రజలు ఎక్కడికక్కడ స్పృహ కోల్పోతున్నారు. దీంతో ప్రాణభయంతో ఇళ్ల నుంచి పరుగులు పెడుతున్నారు ప్రజలు. ఒక్కసారిగా భారీ మొత్తంలో లీకైన ఈ గ్యాస్ దాదాపు చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెందడంతో.... ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జి పాలిమర్స్ అనే ప్లాస్టిక్ తయారీ కంపెనీ నుంచి విష వాయువు లీకైంది. 

 

 

 ఇక భారీ మొత్తంలో ఈ విషవాయువు లీక్ కావడంతో... ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. ఇక తెల్లవారుజామున ఈ విష వాయువు కావడంతో ఇంట్లో నిద్దట్లో  ఉన్న ప్రజలు నిద్దట్లోనే  స్పృహ కోల్పోతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఈ విష వాయువు కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక రోడ్డుపై వెళ్తున్న ప్రజలు కూడా ఎక్కడికక్కడ స్పృహ కోల్పోయి  కింద పడిపోతున్నారు. అయితే అధికారుల సమాచారం అందుకొని హుటాహుటిన అక్కడకు చేరుకొని... ఈ విష వాయువు కారణంగా స్పృహ  కోల్పోయిన వారిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే ఈ జనాలను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ డ్రైవర్ సైతం స్పృహ కోల్పోయిన పరిస్థితి వచ్చింది. 

 

 

 ఎంతో ఘాఢతతో కూడుకున్న ఈ ఈ విష వాయువు వెలువడడంతో ప్రజలకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన కళ్ల మంటలు, కడుపులో వికారం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా ఎక్కడికక్కడ స్పృహ కోల్పోతున్నారు ప్రజలు. అయితే ఈ విష వాయువు లీకేజీ ఆపటం  ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని అందుకే వెంటనే ప్రజలు తమ తమ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో ప్రజలు తమ తమ ఇళ్లను వదిలి పరుగులు పెడుతున్నారు.అయితే ఈ విష వాయువు కారణంగా ప్రజల ప్రాణాల మీదికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: