ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి అవినాభావ సంబంధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రతి విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా ఇద్దరు నిర్ణయాలు ఒకే విధంగా కూడా ఉంటున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా  ఇద్దరు ముఖ్యమంత్రులు పాలన కొనసాగిస్తున్నారు. ఇలా ప్రతి విషయంలో రెండు రాష్ట్రాలు ప్రత్యేకంగా ఏర్పడినప్పటికీ ఒకే రాష్ట్రంగా ముందుకు సాగుతున్నట్లుగా ఉంది  ప్రస్తుత పరిస్థితి. 

 

 

 కానీ ఒక విషయంలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని వెనక్కు నెట్టి మొదటి ప్లేస్ లో నిలిచింది. ఇంతకీ ఎందులో వైసీపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ని వెనక్కి నెట్టింది అని ఆలోచిస్తున్నారా... అది ఏ విషయంలో అంటే విరాళాల  విషయంలో. విరాళాల  విషయంలో దేశంలోని టాప్ ప్లేస్ లో నిలిచింది  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీ రెండవ స్థానంలో నిలిచింది. క్రమంగా నాలుగవ స్థానంలో టిడిపి పార్టీ నిలిచింది.

 

 

 ఇంతకీ ఈ మూడు పార్టీలు ఎంత మొత్తంలో విరాళాలు సేకరించి మొదటి స్థానాల్లో నిలిచాయి అంటే... 2018-19 సంవత్సరానికి గాను దేశంలోని ప్రాంతీయ పార్టీలు అన్నింటిలో వైసీపీ పార్టీకి ఎక్కువ మొత్తంలో విరాళాలు వచ్చాయి. 142 సంస్థలు, వ్యక్తులు కలిపి మొత్తం వైసీపీ పార్టీకి 80.17 కోట్ల విరాళం ఇచ్చారు.  ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ దేశంలోనే ఎక్కువ విరాళాలు సేకరించిన ప్రాంతీయ పార్టీగా రెండవ స్థానంలో ఉంది. టిఆర్ఎస్ పార్టీకి 41.27కోట్ల విరాళాలు అందాయి. ఇక 26.17 కోట్లతో టిడిపి పార్టీ విరాళాల సేకరణ లో ప్రాంతీయ పార్టీల లో నాలుగవ స్థానంలో ఉంది. ఈ విషయాన్ని ఏడీఆర్  సంస్థ నివేదికలో వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: