మొదటి నుంచి కరోనా వైరస్ విషయంలో అమెరికా చైనా దేశాన్ని తప్పుబడుతూ వస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ అనేది పాములు గబ్బిలాల కారణంగా రాలేదని వుహాన్ లోని వైరాలజి ల్యాబ్ లో సృష్టించచబడింది అంటూ చైనా పై ఆరోపణలు చేస్తూనే ఉంది అమెరికా దేశం. ఇక అమెరికా శాస్త్రవేత్తలు వుహాన్ కి వెళ్లి పరిశోధనలు చేస్తామంటే కూడా అనుమతించలేదు చైనా. ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన శాస్త్రవేత్తలను కూడా అనుమతించలేదు. అయితే చైనా ప్రభుత్వం కరోనా వైరస్ రహస్యాలను దాచి పెట్టడం లో మరింత కఠినంగా వ్యవహరిస్తుందని అని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా చైనాకు చెందిన బ్యాట్ ఉమెన్ గా పిలిచే వ్యక్తి కనిపించకపోవడం కూడా దీనికి మరింత ఊతమిస్తోంది.
చైనాలో బ్యాట్ ఉమన్ గా పేరుపొందిన అటువంటి షియాంగ్ లీ గబ్బిలాలు ఒంటె హెచ్ఐవి మూడు వైరస్లను కలిపి చేసినటువంటి కొత్త వైరస్ తయారు చేసేటటువంటి క్రమంలో అది కాస్తా ప్రమాదవశాత్తు లీక్ అయిందా లేదా ఉద్దేశపూర్వకంగానే మానవాళిపై ప్రయోగం జరిగిందా . లేదా ఒక మార్కెట్ ద్వారా దాన్ని వ్యాపింపజేశారా అన్న దర్యాప్తు అయితే ఇప్పట్లో తేలేవి కాదు ఇవన్నీ చరిత్రలో మిస్టరీగానే మిగిలిపోతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి నటువంటి రాసిన షియాంగ్ లీ తాను బతికే ఉన్నాను అంటూ ఒక పోస్టును సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కానీ తర్వాత నిజంగానే కనిపించడంలేదు షియాంగ్ లీ అన్నట్టువంటిది అమెరికా చేస్తున్న ఆరోపణ. ప్రస్తుతం అమెరికా తో పాటుగా అమెరికా మిత్ర దేశాల మీడియాలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. చైనా బ్యాట్ ఉమెన్ గా పిలుచుకునే షియాంగ్ లీ ఎటు వెళ్లింది చైనానే మాయం చేసిందా అనే కథనాలు ప్రస్తుతం ఆయా దేశాలు మీడియా ప్రచురితం చేస్తున్నాయి. ప్రస్తుతం షియాంగ్ లీ మిస్సయింది.. అయితే ప్రపంచం మొత్తం చైనా పై ఒత్తిడి తీసుకు వచ్చినప్పుడు విచారణకు సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తులను ప్రస్తుతం చైనా క్రమక్రమంగా మాయం చేస్తుంది అనే ఆరోపణ నిజమా కాదా ఉన్నటువంటి రానున్న రోజుల్లో తేలాల్సి ఉంది