రాయలసీమ ప్రాంతంలో భూమారెడ్డి అఖిలప్రియ పేరు తెలియని వారు ఉండరు. భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత ఆళ్లగడ్డలో అతని రాజకీయ వారసురాలిగా తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుపెట్టిన ఈమె అతి కొద్ది కాలంలోనే మంచి నాయకురాలిగా గుర్తింపు పొంది బాబు క్యాబినెట్ లో మంత్రి పదవిని కూడా చేజిక్కించుకుంది. తండ్రి మాదిరే మంచి ఫైర్ బ్రాండ్ మరియు మాటకారి అయిన అఖిలప్రియ పై ఇప్పుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీకి చెందిన అధికార ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

మాజీ రాష్ట్ర మంత్రి భూమా అఖిలప్రియ ఏకంగా సుపారీ ఇచ్చి సుబ్బా రెడ్డి పై హత్యకు కుట్ర పన్నిందని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రంలో పెను దుమారాన్నే రేపాయి. ఎప్పటినుండో అఖిలప్రియ మరియు ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి కుటుంబాలకు స్థానికంగా పెద్ద వైరమే ఉంది. కర్నూలు జిల్లాలో వారివి తరతరాల ఫ్యాక్షన్ గొడవలు. అయితే ఇప్పుడు గంగుల ప్రభాకర్ రెడ్డి అధికార పార్టీలో ఉండి అఖిల ప్రియ సంచలన ఆరోపణలు చేయడం విశేషం.

 

ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి సుబ్బారెడ్డి ని చంపడానికి అఖిలప్రియ 50 లక్షల రూపాయల సుపారీ ఇచ్చిందని మరియు ఇంత చిన్న వయసులోనే ఆమె హత్యలు.... కుతంత్రాలు పన్నుతోందని ఎమ్మెల్సీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. హత్యకు సుపారీ తీసుకున్న ముగ్గురూ పోలీసుల చేతికి చిక్కారని మరియు తర్వాత పోలీసులు ఆమెను అరెస్టు చేస్తారన్న భయంతో అఖిలప్రియ కొద్ది రోజులు పారిపోయింది అని ఆయన అన్నారు.

 

ఆళ్లగడ్డలో ప్రజలు అఖిలప్రియను ఓడించినా ఇంకా పద్ధతి మార్చుకోలేదని ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ఇక కరోనా టైంలో ఆహోబిలం ఆలయం తెరిచి వైసీపీ నేతలు గంగుల పూజలు చేశారని అఖిలప్రియ ఆరోపించారు. దీనికి కౌంటర్ గా గంగుల తాజాగా అఖిలప్రియపై సంచలన ఆరోపణలతో హీట్ పెంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: