ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీంటిని గడగడ లాడిస్తూ తన వైపునకు తిప్పుకోవడంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తర్వాతే ఎవరైనా. అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ఏ మాత్రం లొంగకుండా అణ్వస్త్ర పరీక్షలు పదే పదే చేసే కిమ్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని ... ఆయన చనిపోయాడంటూ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. 15 రోజుల పాటు ఈ వార్తలు జోరుగా వైరల్ అవ్వడంతో పాటు కిమ్ సోదరి దేశ అధ్యక్ష పగ్గాలు కూడా చేపడుతున్నారంంటూ ఒక్కటే హడావిడి జరిగింది.
ఈ వార్తలు పటా పంచలు చేస్తూ కిమ్ ఒక్కసారిగా ప్రత్యక్ష మయ్యారు. అయితే ఇప్పుడు వెలువడుతో న్న ఓ కథనం ప్రపంచానికి షాక్ ఇచ్చేలా ఉంది. కిమ్ చనిపోయాడంటూ వచ్చిన పుకార్లు కిమ్ క్రియేట్ చేసినవే అట. తన శత్రువలును గుర్తించే క్రమంలోనే కిమ్ ఇలా ఓ వ్యూహం పన్ని తనకు తానుగా 15 రోజుల పాటు సీక్రెట్ ప్లేసులో ఉండడంతో పాటు తన వెనకే ఉంటూ తన రహస్యాలు శత్రువులకు చేరవేసే వాళ్లను గుర్తించేందుకే ఈ ప్లాన్ వేశాడని ఈ కథనం చెప్పింది. స్కై న్యూస్ ఆస్ట్రేలియా వెలువరించిన ఈ వార్తా కథనం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అనేక సరికొత్త సందేహాలకు తావిస్తోంది. గతంలో కిమ్కు అత్యంత సన్నిహితంగా ఉంటూ ఇప్పుడు దక్షిణ కొరియాలో ఉంటోన్న ఓ ఇద్దరు పాత సన్నిహితులు వేస్తోన్న కుట్రలను తిప్పికొట్టేందుకే కిమ్ తనకు తాను చనిపోయాడన్న పుకార్లు క్రియేట్ చేసుకున్నాడని అంటున్నారు.
అలాగే తమ దేశంలోనే ఉంటోన్న కొందరు సైతం అమెరికాకు తన రహస్యాలు చేరవేస్తోన్నందున కూడా కిమ్ కొన్ని రోజులు సీక్రెట్గా ఉంటూ ఇంటిలిజెన్స్ ద్వారా అసలు ఏం జరుగుతోందో కనిపెట్టాడట. ఇక మరి కొందరి అంచనాల ప్రకారం ఇప్పుడు బయటకు కనిపించే కిమ్ కూడా డూప్లికేట్ అయ్యి ఉండవచ్చని ... ఇది కూడా కిమ్ సృష్టే అంటున్నారు. ఏదేమైనా కిమ్ మాస్టర్ ప్లాన్తో ఇప్పుడు ప్రపంచ దేశాలు మరోసారి నివ్వెర పోతున్నాయి.