ఒకవైపు దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉంటే మరోవైపు క్రైమ్ కేసులు కూడా చిన్నగా పెరుగుతూ వస్తున్నాయి. హత్యలు, గొడవలు, అక్రమ సంబంధాలు ఇలా అనేక కేసులు ప్రస్తుతం దేశంలో మళ్లీ మొదలయ్యాయి అని చెప్పవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే.. మాయమాటలు చెప్పి అమాయకత్వం బాలికను లొంగదీసుకున్న సంఘటన ఒకటి ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. అంతేకాకుండా అనేక మార్లు ఆమెపై అత్యాచారం చేసిన ఆ కామాంధుడు.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నేను నిన్ను చంపేస్తాను అని బెదిరించడంతో బాలిక ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండేది.

 


దీనితో చివరికి ఆమె గర్భం దాల్చి శరీరంలో మార్పులు రావడంతో.. కుటుంబ సభ్యులకు అనుమానం రావడం జరిగింది. ఇక ఏమి జరిగింది అని బాలికను నిలదీయగా అసలు విషయం బయటకు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక పూర్తి వివరాలు చూస్తే...  ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం, తుమ్మలచెరువు గ్రామానికి చెందిన ఒక బాలిక పై తన బంధువు అయిన కాశీం వలి అనే వ్యక్తి కన్నేసాడు. నిజానికి కాశీం వలి కు అప్పటికే పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. అయినా కానీ బాలికకు మాయమాటలు చెప్పి మోసం చేశాడు. అంతేకాకుండా సమయం దొరికినప్పుడల్లా బాలికపై లైంగిక దాడి చేసేవాడు. దీనితో చివరికి బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం బయటకు రావడం జరిగింది.

 


ఇంకా విషయాన్ని బాలిక, కుటుంబ సభ్యులు పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక నిందితుడైన కాశీం వలి పై నిర్భయ కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే దర్శి DSP ప్రకాష్ రావు, పొదిలి సిఐ శ్రీరామ్ తుమ్మలచెరువు గ్రామానికి వెళ్లి బాధితురాలి కుటుంబ సభ్యులను సందర్శించారు. అలాగే వారితో మాట్లాడి సంబంధిత వివరాలు నమోదు చేసుకోవడం జరిగింది. ఇక అమాయకురాలు అయిన బాలిక జీవితాన్ని సర్వనాశనం చేసిన నిందితుడు కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: