ఒకవైపు తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ విరుచుకు పడుతూ ఉంటే... మరోవైపు హత్యలు, ఆత్మ హత్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో కూడా ఇలాంటి దారుణమైన ఘటనలు చోటు చేసుకోవడం చాలా బాధాకరం అనే చెప్పాలి. తన ప్రేమను ఒప్పుకోలేదు అని యువతిని ఒక దుర్మార్గుడు దారుణంగా హత్య చేసిన సంఘటన అనంతపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

 

IHG

 

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... అనంతపూర్ జిల్లా పెద్దవడుగూరు మండలం గుత్తి గ్రామంలో ఒక  ప్రేమోన్మాది యువతిపై హత్య ప్రయత్నం చేయడం జరిగింది. తన ప్రేమను ఆ యువతి అంగీకరించ లేదు అన్న కోపంతో ఆ యువతి గొంతు కోసేసాడు. గుత్తి గ్రామానికి చెందిన సుభద్ర అనే  అమ్మాయిని రామాంజనేయులు అనే యువకుడు గత కొద్ది రోజులుగా ప్రేమ పేరుతో ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. అంతే కాకుండా తనను ప్రేమించాలని పెళ్లి చేసుకోవాలని చాలా సార్లు అడగగా ఆ అమ్మాయి నిరాకరించింది. 

 

IHG


దీనితో సుభద్ర పై కోపం పెంచుకున్న రామాంజనేయులు ఆమెను చంపేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక సుభద్ర ఇంటి సమీపంలో కత్తితో దాడి చేసి గొంతు కోసేసాడు దుర్మార్గుడు. రక్తం మడుగులో ఉన్న ఆమెను గ్రహించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇక హుటాహుటిగా బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

 

ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలియజేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసు అధికారులు వారి కుటుంబ సభ్యులను సంప్రదించి వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఈ  సంఘటనపై మరిన్ని వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు పోలీసు అధికారులు.ఇలాంటి వారికీ కఠిన శిక్ష పడాలని కుటుంబ సభ్యుల కోరడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: