ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 రోజుల పాటు మద్యం షాపులు మూసి వేసిన విషయం తెలిసిందే.  దేశంలోకరోనా మహమ్మారి పెరిగిపోతుందన్న నేపథ్యంలో లాక్ డౌన్ మొదలు పెట్టారు.  అప్పటి నుంచి మద్యం షాపులు అన్నీ మూసి వేసిన విషయం తెలిసిందే.   కొన్ని కారణాల వల్ల మద్యం షాపులు ఓపెన్ చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.  అప్పటి నుంచి అన్ని రాష్ట్రాల్లో మద్యం షాపులు ఓపెన్ చేయడంతో మందు బాబుల ఆనందానికి అవధులే లేకూండా పోయాయి. ఇన్నాళ్ల కరువంతా ఒక్కసారే తీర్చుకుంటున్నారు.  యువతులు కూడా ఏం తక్కువ తినలేదు. మగవారితో సమానంగా క్యూ లైన్లలో నిలబడి మద్యం బాటిళ్లు తీసుకెళ్లారు. ఇలా ఫుల్‌గా తాగేసిన వారు రోడ్లపై హంగామా సృష్టిస్తున్నారు. తాగిన మైకంలో ఏం చేస్తున్నారో తెలియకుండా ప్రవర్తిస్తున్నారు.  

 


పీకల దాకా మద్యం సేవించి రోడ్లపై తెగ హల్ చల్ చేస్తున్నారు.. రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ యువతి పెట్రోల్ పంపులో చేసిన రచ్చకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.   ఆనుపూర్‌లోని ఓ పెట్రోల్ పంపులో పీకలదాకా తాగిన ఓ యువతి రెచ్చిపోయింది. మత్తులో ఏం చేస్తుందో తెలియకుండా పెట్రోల్ పంపులో పని చేస్తున్నవారిపై చిందులేసింది. చేతికి దొరికిన వాటిని అన్ని లాగిపడేసింది.

 


 ఆ అమ్మాయి మత్తులో ఉంది.. ఏమన్నా అనాలంటే తర్వాత ఎం ఇబ్బందులు వస్తాయో అన్న భయంతో పెట్రోల్ బంక్ యజమానులు సైతం ఏమీ అనలేక పోయారు.  నానా యాగీ చేసిన ఆ యువతి తీరుపై వెంటనే సిబ్బంది  పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తతంగం అంతా స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా దేశవ్యాప్తంగా మద్యం షాపులు తెరుచుకోవడంతో ఒక్క రోజులోనే కోట్లాది రూపాయాల మద్యం తాగేశారు మందుబాబులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: