దాదాపు 40 రోజుల తర్వాత లాక్ డౌన్ సడలింపు లో భాగంగా మద్యం దుకాణాలు తెరిచి ఉన్న విషయం తెలిసిందే. దీంతో గత 40 రోజుల నుండి ఎంతో నిరీక్షణ మద్యం కోసం ఎదురుచూస్తున్న మందుబాబులు కొత్త ఊపిరి వచ్చింది అనే చెప్పాలి. దీంతో ఫుల్లుగా తాగేసి తూలుతున్నారు మందుబాబులు. ఈ క్రమంలోనే మందుబాబు కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఫుల్లుగా మద్యం తాగి మద్యం మత్తులో బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి పాము అడ్డు రావడంతో ఆ పనులు ఏకంగా నోటితో కొరికి చంపేసిన వీడియో గత రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది,
అయితే ఈ పామును కొరికిన వ్యక్తి ఏమయ్యాడు ఆ తర్వాత హాస్పిటల్ కి వెళ్లాడా అతనికి ఏమైనా అయిందా అనే విషయం ప్రస్తుతం నెటిజన్లకు ఓప్రశ్నకు మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో మాత్రం గత మూడు నాలుగు రోజుల నుండి సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. అయితే ఫుల్ గా మద్యం తాగి కుమార్ అనే వ్యక్తి బైక్ పై వెళ్తున్న సమయంలో బైక్ రెండు చక్రాల మధ్య ఓ పాము రావడంతో... దాని పట్టుకొని మెడలో వేసుకున్నాడు కుమార్. ఇక ఆ తర్వాత ఆ పాము అటు ఇటూ కదులుతుండటంతో చిరాకు వచ్చిన కుమార్ అనే వ్యక్తి.. ఆపామును కొరికి చంపేశాడు.
ఇక కుమార్ అనే వ్యక్తి ఇదంతా చేస్తున్న సమయంలో జనాలు మొత్తం ఆశ్చర్యంగా గుమిగూడి కుమార్ ను చూస్తున్నారు. అదే సమయంలో ఫోటోలు వీడియోలు కూడా తీశారు చుట్టుపక్కల గుమిగూడిన జనం. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతని దగ్గరికి వెళ్లి వెతికితే.. అప్పటికే అతను ఇంటికి వెళ్ళిపో గా ఆ పాము అప్పటికే చనిపోయింది.కాగా వన్యప్రాణి కార్యకర్త అయిన వ్యక్తి ఫిర్యాదు చేయగా దీనిపై విచారణ కొనసాగుతోంది. శరత్ బాబు అనే వన్యప్రాణి కార్యకర్త పెట్టిన ఫిర్యాదు మేరకు కుమార్ ను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు అరెస్టు చేశారు. అతను చంపినటువంటి పాము ర్యాట్ స్నేక్ అని అది ఎంతో అరుదైన జాతి అని వన్య ప్రాణి కార్యకర్త ఫిర్యాదు చేశారు.