తెలంగాణకు వలస కార్మికుల ద్వారా కరోనా వ్యాప్తి ప్రమాదం పొంచి ఉందా ?, అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది . కేంద్రం... లాక్ డౌన్ ఆంక్షలు సడలించి , వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించింది . దీనితో బతుకు దెరువుకోసం
తెలంగాణ నుంచి ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లిన వలస కార్మికుల ఇంటి బాట పట్టారు .
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది జీవనోపాధికోసం ముంబాయి కి వలస వెళ్లారు .
మహారాష్ట్ర లో కరోనా విస్ర్తుతంగా వ్యాప్తి చెందడం తో , ముంబాయి నుంచి స్వస్థలాలకు చేరుకుంటున్న వారి వైపు అనుమానపు చూపులు మొదలయ్యాయి .
దానికితోడు ముంబాయి నుంచి సంస్థాన్ నారాయణపూర్ మండల పరిధి లోని జనగాం కు వెళ్తోన్న ముగ్గురు వలస కార్మికులను పరిక్షించగా, వారికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడం తో , ఐసోలేషన్ కు తరలించారు . ఒక్క ముంబాయి కే , కాకుండా
గుజరాత్ నుంచి వచ్చే వలస కూలీలకు కూడా కరోనా ప్రమాదం పొంచి ఉండే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి . అయితే ముంబాయి , గుజరాత్ నుంచి స్వస్థలాలకు వచ్చిన వలస కూలీలను గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది .
వలస కూలీలు ఎవరైనా తమ గ్రామానికి వచ్చినట్లయితే ,
స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు . ఇక ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వలస కూలీలను రాష్ట్ర సరిహద్దుల్లోని కరోనా పరీక్షలు నిర్వహించి రాష్ర్టంలోని వారి స్వస్థలాలకు అనుమతించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ
మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు .