పెళ్లి అయ్యి సంవత్సరం కాక ముందుకే ఆ అమ్మాయి జీవితం నరకమయం అయ్యింది. కట్టుకున్న భర్త  కిరతకుడిగా మారి దారుణానికి పాల్పడ్డాడు. భార్య నగ్న ఫోటోలను తీసి తన ఫ్రెండ్స్ కి షేర్ చేసి పైశాచిక ఆనందం పొందేవాడు ఆ నీచకుడు. అంతేకాకుండా తన స్నేహితులతో సెక్స్ చేయాలని ఆ అమ్మాయిని వేధింపులకు గురి చేసేవాడు. ఇక కొద్దిరోజులు మౌనంగా భరించిన అమాయకురాలు వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసింది. ఇక ప్రాణాలు తీసుకునే ముందు తన భర్త గురించి ఒక పేపర్ లో రాసి చనిపోయింది. ఈ దారుణమైన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 

 

భర్త నీచ కోరికలను తీర్చ లేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన గెలియర్ నగరంలో  గొస్పుర ప్రాంతంలో చోటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న భార్యభర్తలు ఇద్దరు సంవత్సరం కిందట వీరిద్దరికి వివాహం అయింది. కొన్ని రోజులు బాగానే చూసుకున్న భర్త ... ఏమైందో ఏమో నెమ్మది నెమ్మదిగా పైశాచికత్వాన్ని బయట పెట్టాడు. ఇక ఇదే క్రమంలోనే భార్య నగ్నంగా ఉండే ఫోటోలు తీసి తన స్నేహితులకు షేర్ చేసేవాడు. 

 


ఇక మరికొద్ది రోజుల తర్వాత తన స్నేహితులతో వారి కామకోరికలను తీర్చాలని బలవంతంగా వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. ఇక ఈ వేదింపులు తట్టుకోలేని ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. వారి ఇంట్లోనే ఉరివేసుకొని తన నిండు ప్రాణాలను విడిచింది. అయితే తాను ప్రాణాలు విడిచే ముందు తన భర్త గురించి దారుణాలను అన్ని వివరిస్తూ ఒక సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. ఆ సూసైడ్ నోట్ ను పోలీస్ అధికారులు పరిశీలించి భర్తను అరెస్ట్ చేశారు. ఇక పూర్తి విచారణ చేపడుతున్నారు పోలీసులు. రోజురోజుకు దేశంలో మానవత్వం, భయం అనేవి లేకుండా పోతున్నాయి. కొందరు మనుషులు క్రూర మృగాలకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: