ఒకవైపు తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మరోవైపు హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. తమ్ముడు వరుసయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక మహిళ కట్టుకున్న భర్త అడ్డు చెబుతున్నాడని హత్య చేసేందుకు సిద్ధమైంది కిరాతకురాలు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... ధర్మవరం పట్టణ మేడాపురం రైల్వే బ్రిడ్జి వద్ద హత్య చోటు చేసుకుంది. హత్య కేసులో నలుగురిని నిందితులుగా గుర్తించి ధర్మవరం పోలీస్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే విచారణలో చాలా ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

 

ధర్మవరం పట్టణంలో నాగేంద్ర, నాగమణి ఇద్దరు దంపతులు నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇక నాగమణి మేడాపురం గ్రామానికి చెందిన ఒక యువకుడుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. దానికి ఆ యువకుడు ఆమెకు తమ్ముడు వరస అవుతాడు. అంతేకాకుండా ఆ యువకుడు తరచుగా ఆమె ఇంటికి వెళ్లి రాసలీలలు కొనసాగించేవాడు. ఇక ఈ విషయం నాగరాజు బంధువుల మధ్య పంచాయతీ పెట్టడం జరిగింది. ఈ పంచాయతీలో పద్ధతి, తీరు రెండు మార్చుకుని మంచిగా ఉండాలని నాగమణికి బంధువులు సూచించారు. దీనితో ఆమె భర్త మీద కోపం పెంచుకుని తన సుఖానికి అడ్డు వస్తున్నాడని చంపేయాలని నిర్ణయం తీసుకుంది. 

 

తన భర్తను చంపేయాలని తన స్నేహితుకికి ఒక లక్ష రూపాయలు నగదు రెండు సెట్లు భూమి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అంతే కాకుండా వారికి సహాయం చేసిన బ్రహ్మయ్య కూడా లక్ష రూపాయలు ఇస్తానని చెప్పింది. దీనితో స్నేహితులు అందరూ కుట్రపన్ని మద్యం తాగుదాం అంటూ బాబు బ్రహ్మయ్య కలిసి నాగరాజును ధర్మవరం శివారులో మేడారం రైల్వే స్టేషన్ వద్దకు తీసుకెళ్లడం జరిగింది. మద్యం మత్తులో ఉండే నాగేంద్ర బాబు, బ్రహ్మయ్య ఇద్దరూ కలిసి బండరాయితో తల మీద పొట్టి చంపేయడం జరిగింది. ఈ ఆశక్తికర విషయాలు అన్నీ కూడా అధికారులు బయటపెట్టారు. దీనితో నిందితులు అయిన అందరిని అరెస్ట్ చేసి ధర్మవరం కోర్టులో హాజరు పరచడం జరిగింది. న్యాయ స్థానం అధికారులు నలుగురికి రిమాండ్ విధించడంతో వారి అందరినీ జైలుకు తరలించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: