దేశంలో ఒకవైపు కరోనా దేశవ్యాప్తంగా ప్రజలను భయాందోళనలకు గురి చేస్తూ ఉంటే మరోవైపు దుర్మార్గులు హత్యలు, ఆత్మహత్యలు చేస్తున్నారు. మైనర్ బాలికతో పాటు కుటుంబ సభ్యులలో ముగ్గురిని గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్య అర్ధరాత్రి వేళ ఇంట్లో చొరబడి మరి వారి గొంతులు కోసి చంపేశారు. అంతేకాకుండా మృతదేహాలను చెల్లాచెదురుగా పడేయడం జరిగింది. ఇక ఆ మైనర్ బాలికను మాత్రం రేప్ చేసి హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణమైన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌ రాజ్‌ లో చోటు చేసుకోవడం జరిగింది.

 

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రయాగ్ ‌రాజ్‌ పరిధిలోని ఒక గ్రామంలో.. ఇంట్లోకి గుర్తుతెలియని దుండగులు చొరబడి అతి దారుణంగా ముగ్గురిని గొంతుకోసి హతమార్చారు. ఇక వృద్ధ దంపతుల మృతదేహాలు ఇంటి బయట పడేసి బాలిక మృతదేహం ఇంట్లో పడేసారు. ఇక ఆ మైనర్ బాలికను హత్య చేసే ముందు దుండగులు ఆమెను రేప్ చేసి హత్య చేశారని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అక్కడి స్థానికులు. 

 


ఈ దారుణమైన ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించడం జరిగింది. అలాగే క్లూస్ టీం ఫోరం ఫోరెన్సిక్ టీంలను ఘటనాస్థలానికి పిలిపించి ఆధారాలు సేకరించడం జరిగింది. ఇక హత్య జరగడానికి ముఖ్య కారణం ఆస్తి వివాదాల విషయం ఉండొచ్చు అని పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అదే గ్రామంలో తన పెద్ద కొడుకు ఉండగా విచారణ జరిపారు కానీ అతను ఎవరి మీద అనుమానం లేదు అని తెలిపాడు.


అయితే తన తమ్ముడు ముంబైలో ఉంటాడని.. తమ్ముడి భార్య కొన్ని రోజుల క్రితం వారితో గొడవ పడినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అంతేకాకుండా చంపేస్తానని బెదిరించారు అని తెలియజేశాడు. ఇక వృద్ధ దంపతుల ఆభరణాల వంటి విలువైన వస్తువులు కూడా కనపడకపోవడం పై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: