రోజురోజుకి దేశంలో మళ్లీ హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు ఇలా మల్లి క్రైమ్ ఎక్కువ అవుతుంది. నిజానికి లాక్ డౌన్ రోజులలో క్రైమ్ పూర్తిగా తగ్గింది. ఇకపోతే కొన్ని సడిలింపుల కారణంగా మళ్లీ బయటకు వచ్చిన ప్రజలు మళ్లీ వారి ప్రవుత్తులను తిరిగి మొదలు పెట్టారు. అయితే ఇక అసలు విషయానికి వస్తే ... పశువుల మేతకోసం నది ఒడ్డుకు వెళ్లిన బాలికను లాక్కువెళ్ళి రేప్ చేసిన దారుణ ఘటన ఒకటి ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.

 

ఆ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లా ఘతంపూర్ ప్రాంతానికి చెందని ఒక పదేళ్ల బాలిక పశువులకు మేత తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి బయటికి వచ్చింది. ఇకపోతే ఆ అమ్మాయి దగ్గరలోని రింధ్ నది ఒడ్డున మేత కోస్తుండగా అదే గ్రామానికి చెందిన బాలుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. అక్కడ ఉన్న బాలికను పక్కకు లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు దుర్మార్గుడు. దీనితో బాలిక తప్పించుకోకుండా గట్టిగా నోరు పట్టుకుని పక్కకు తీసుకెళ్లి రేప్ చేశాడు. 


ఇక ఆ సంఘటన జరిగిన తర్వాత ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పడంతో వెంటనే పోలీసులను వారు ఆశ్రయించారు. దీనితో మైనర్ బాలికపై మరో మైనర్ అత్యాచారం చేయడం పెద్ద కలకలాన్ని రేపింది. అంతే ఇక బాలుడిని అదుపులోకి తీసుకుని పూర్తి విచారణ జరుపుతున్నారు. అంతే కాకుండా ఆ బాలుడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు ఘతంపూర్ పోలీస్ స్టేషన్ సీఐ రవి కుమార్ సింగ్ సమాచారం ఇచ్చారు. ఇక బాలుడిని జువైనెల్ హోమ్ ‌కి తరలించినట్లు పోలీసులు విషయాన్నీ తెలిపారు. నిజానికి ఇలా చిన్న వయసులోనే ఇలాంటి ఘాతుకాలకు పాలుపడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నేటి యువత. నిజానికి వారి తల్లితండ్రులు కూడా పిల్లల ఎదుగుతలని గమనిస్తుంటేనే వారు కాస్త కంట్రోల్ లో ఉంటారు. లేకపోతే ఇలాంటి సంఘటలను చూడాల్సి వస్తుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: