ప్రపంచంలో కరోనా మహమ్మారి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం.  చిన్న దేశాల నుంచి ఆగ్ర రాజ్యం అమెరికా సైతం అల్లల్లాడిపోతుంది.  అమెరికా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్ ఇలా అన్ని దేశాల్లో పిట్టల్లా రాలిపోయారు.  అమెరికాలో ప్రపంచంలో మూడో వంతు దాదాపు 72 వేల వరకు మరణాలు సంబవించాయి.   ఇక మన దేశంలో కూడా కరోనా విజృంభిస్తుంది.  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే.  అయితే కరోనా ఎక్కువ మనిషి శ్వాస  తీసుకోవడానికి ఇబ్బందులు పెట్టి చివరికి చనిపోయే పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు.  జలుబు, దగ్గు., జర్వం రావడం శ్వాస తీసుకోవడం ఇబ్బందులు పడుతు చనిపోతున్నారు.  సాధారణంగా కరోనా వైరస్ సోకితే న్యూమోనియా ఏర్పడుతుందని, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరిగిపోతుందని ఇప్పటివరకు భావిస్తున్నారు. అయితే, ఇటీవల కరోనా కారణంగా హార్ట్ అటాక్ కు గురవుతున్న కేసులు పెరిగిపోతుండడంతో ఈ మహమ్మారి వైరస్ గుండెను కూడా దెబ్బతీస్తోందని గుర్తించారు.

 

కరోనా సోకితే శ్వాససంబంధ సమస్యలు ఏర్పడడం అనేది ప్రాథమిక లక్షణం. కానీ, కరోనా మరణాలు పెరిగే కొద్దీ ఆసక్తికర అంశాలు వెల్లడవుతున్నాయి. గతంలో హృదయ సంబంధ సమస్యలు ఉన్నా, లేకపోయినా... కరోనా సోకిన తర్వాత వారిలో గుండె పనితీరు కూడా ప్రభావితమవుతోందని వైద్యులు గుర్తించారు.  కేరళలో కరోనా కారణంగా సంభవించిన మొదటి మరణంలోనూ హార్ట్ ఫెయిల్యూర్ జరిగినట్టు వైద్యులు తెలుసుకున్నారు. ముఖ్యంగా గుండె కండరాలను కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ దెబ్బతీస్తున్నట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

 

అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కి మందు కనిపెట్టడానికి చూస్తున్నారు.  కరోనాతో చనిపోయిన వారిలో 45 నుంచి 55 శాతం మందిలో హార్ట్ ఫెయిల్యూర్, ఆపై మయో కార్డైటైటిస్ సమస్యలు ఏర్పడినట్టు పరిశోధకులు తెలిపారు. ఈ తరహా గుండె సమస్యలు వచ్చిన కరోనా రోగుల్లో 3 శాతం మందే బతికి బట్టకడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: