కొన్ని రోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన " బాయ్స్ లాకర్ రూమ్ కేసు " మరో కోణం దృష్ట్యా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో మరో కొత్త ట్విస్ట్ బయటికి వచ్చింది. అదేమిటంటే వారి క్లాస్ మేట్స్ అమ్మాయిల బాడీ షేవింగ్ పై మాట్లాడుతూ... వారిని గ్యాంగ్ రేప్ చేద్దామంటూ కొందరు విద్యార్థులు చేసిన గ్రూప్ చాట్ ఇప్పుడు అంతటా చర్చకు దారితీస్తోంది. అసలు ఈ విషయంపై విచారణ జరిపిన పోలీసులకు భయంకరమైన షాకింగ్ నిజాలు బయటకు తెలిపారు. అదేమిటంటే ఒక టీనేజ్ అమ్మాయి అబ్బాయిగా ఫేక్ అకౌంట్ ను తయారుచేసి అబ్బాయిలతో చాటింగ్ చేసినట్లు ఆ విచారణలో విస్తర గొలిపే విషయం తెలిసింది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే... తన శరీరంపై తానే అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, వాటి మీద అబ్బాయిలు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడాలని తను ఇలాంటి పని చేసినట్లు విచారణలో పేర్కొన్నట్లు ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని తెలియజేశారు.

 

 

ఆ గ్రూపులో అబ్బాయిగా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అందరికీ సిద్ధార్థ గా తనని పరిచయం చేసుకుంది గ్రూప్ సభ్యులతో. ఇక ఆ గ్రూప్ లో ఆమె పై ఆమెనే అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ దానికి అబ్బాయిలు ఎలా రియాక్ట్ అవుతారో దాన్ని బట్టి క్యారెక్టర్ తెలుసుకోవచ్చని సదరు టీనేజ్ అమ్మాయి తనను జరిపిన విచారణలో తెలిపింది. అయితే బాయ్స్ లాకర్ రూమ్ పేరుతో కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ ఒక అకౌంట్ ని క్రియేట్ చేశారు. అందులో వారి తరగతి అమ్మాయిలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ చాటింగ్ చేసిన సంగతి ఇది వరకు మనకు తెలిసిన విషయమే.

 


ఈ గ్రూపులో ఉండే సభ్యులంతా ఢిల్లీ నగరంలోని ప్రముఖ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కావడం గమనార్హం. అందులో వారి క్లాస్ అమ్మాయిలను గ్యాంగ్ రేప్ చేద్దాం అంటూ సదరు విద్యార్థులు చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్ లను సోషల్ మీడియాలో వైరల్ చేశారు కొందరు. అయితే ఈ గ్రూపులో అందరూ కూడా కేవలం 18 సంవత్సరాలకి తక్కువగా ఉన్న వారే. అయితే ఈ గ్రూపులో కొంతమంది అమ్మాయిల ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా గ్రూపులో వాటిపై చర్చలు చేస్తున్నారు. ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులు పూర్తి విచారణ చేపట్టడానికి 24 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. ఇలా విచారణ చేస్తుండగా ఇంకా కొన్ని భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: