ఇక లాక్ డౌన్ విషయానికి వస్తే కేవలం బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాలే లాక్ డౌన్ ను పొడిగించాలని కోరగా చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం కేంద్రానికే వదిలేసేయని సమాచారం. ఒకవేళ పొడిగించినా మరిన్ని మినహాయింపులు ఉండేలా చూడాలనే ప్రతిపాదనను మోదీ ముందు ఉంచారు అలాగే విమానాలు , రైళ్ల రాకపోకలను మే 31 వరకు నిషేధిస్తే మంచిదని తమిళనాడు , తెలంగాణ ముఖ్యమంత్రులు కోరారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకొని ఈనెల 16లేదా 17న లాక్ డౌన్ పై మోదీ కీలక ప్రకటన చేసే అవకాశాలు వున్నాయి. ఇదిలావుంటే దేశంలో కరోనా కేసుల సంఖ్య 68000కు చేరగా అందులో 2000కుపైగా మరణాలు సంభవించాయి.