ప్రపంచంలో కొంత మంది మనుషులు భోజనం లేకుండా అయినా బతుకుతారేమోకానీ పగలు ప్రతీకారాలు మాత్రం మానరు.  తాము ఎవరిపైనా పగబడితే వారి వినాశనం అయ్యేవరక వదలరు.  ఈ తరహా సినిమాలు ఎన్నో వచ్చాయి.. వస్తున్నాయి.  రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోకూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. ఫ్యాక్షన్ గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. ఆదిపత్య పోరు, ప్రగలూ ప్రతీకారాలు ఇక్కడ ఒకప్పుడు దారుణంగా ఉండేవని అంటారు.  ఇటీవల కాలంలో కాస్త ఫ్యాక్షనీజం తగ్గిందని చెబుతున్నారు. అయితే త‌మిళ‌నాడులో దారుణం జ‌రిగింది. తండ్రి మీద కోపంతో ఇద్ద‌రు దుండ‌గులు అత‌ని 14 ఏండ్ల కూతురుపై పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టారు. ఆ బాలిక ఎంత ప్రాదేయ పడ్డా కఠినాత్ములు ఏమాత్రం కనికరించుకుండా దారుణంగా కాల్చి వేశారు.

 

ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ బాలిక‌ను ఆస్ప్ర‌త్రిలో చికిత్స పొందుతూ సోమ‌వారం రాత్రి మృతిచెందింది.  వివరాల్లోకి వెళితే.. అల్లుపురం ప‌ట్ట‌ణ స‌మీపంలోని సిరిమదురాయ్ గ్రామానికి చెందిన కె.జ‌య‌బాల్‌, కే కుమార్ సోద‌రుల‌కు, నిందితుడు మురుగన్‌కు మ‌ధ్య ఒక ఎక‌రం భూమి విష‌య‌మై త‌గాదా న‌డుస్తున్న‌ది. ఈ తగాదా గత కొంత కాలంగా పెద్దల సమక్షంలో పలు వివాదాలకు దారితీస్తూ వచ్చింది.  ఈ నేప‌థ్యంలో ఆదివారం ఉద‌యం మురుగ‌న్ స్నేహితుడు జ‌య‌బాల్ కిరాణ దుకాణానికి సిగ‌రెట్ కొనే వంక‌తో వెళ్లి దుకాణంలో ఉన్న జ‌య‌బాల్ కుమారుడు జ‌య‌రాజ్ (17)పై దాడి చేశాడు.

 

ఈ ఘ‌ట‌న‌పై జ‌య‌బాల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. తనపైనే పోలీస్ కేసు పెడతావా అని కసిని మనసులో ఉంచుకొని.. మరింత కోపంతో ఊగిపోయాడు. మురుగ‌న్ త‌న మ‌రో స్నేహితుడు క‌లియ‌పెరుమాల్‌తో క‌లిసి ఆదివారం సాయంత్రం ఇంటిబ‌య‌ట ఆడుకుంటున్న జ‌య‌బాల్ కూతురు జ‌య‌శ్రీ (14)పై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. అనంత‌రం అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు.  కేసు నమోదు చేసుకొని నింధితుల వేటలో ఉన్నారు పోలీసులు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: