అమ్మాయి లను ప్రేమ పేరు తో చాలా మంది అబ్బాయిలు మోసం చేస్తున్నారు. ప్రేమ అని అమ్మాయి లను ముగ్గులో కి దింపి తర్వాత వారి శరీరాల ను అనుభవించి పెళ్లి అనగానే మొహం చాటేస్తున్నారు. లేదా పెళ్లి అనగానే చేసుకుంటామని నమ్మించి అతికిరాతకంగా చంపేస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. అందుకే అమ్మాయిల సంఖ్య పూర్తిగా తగ్గుతుందని నిపుణులు  అంటున్నారు. 

 

 

 

వివరాల్లోకి వెళితే.. ప్రేమ పేరు తో యువతి వెంట తిరిగి, పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు  చెప్పి ఆమెను లైంగికంగా దోచుకున్నాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించి పరారయ్యాడు. మోస పోయానని గ్రహించిన బాధితురాలు ప్రియుడి పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

 

 

 

 

ఈ ఘటన తెలంగాణ లోని ఖమ్మం రఘునాథపాలెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి, అదే గ్రామానికి చెందిన పాలెపు ప్రవీణ్ అనే యువకుడు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించిన ప్రవీణ్ శారీరకంగా అనుభవించాడు. దీంతో యువతి గర్భం దాల్చింది. అయితే గర్భంతో ఉండగా పెళ్లి చేసుకుంటే అందరిలోనూ పరువు పోతుందని, అబార్షన్ చేయించుకుంటే వెంటనే పెళ్లి చేసుకుందామని ప్రవీణ్ ఆమెకు నమ్మబలికాడు.

 

 

 

 

దాంతో  నిజమే అని  అనుకుని నమ్మిన ఆమెకు గట్టి షాక్ ఎదురైంది.. పెళ్లి చేసుకుందామని ఆమె ఎన్ని సార్లు చెప్పిన కూడా వినకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.. అంతేకాకుండా ఆమె ఫోన్ కూడా ఎత్తక పోవడంతో యువతీ మోసపోయానని నమ్మింది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఆరా తీసిన పోలీసులు ప్రవీణ్‌తో పాటు నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేసిన డాక్టర్‌ విజయపై పోలీసులు కేసును నమోదు చేసుకొని అరెస్ట్ చేసారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: