రోజురోజుకు బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువ అయిపోతున్నాయి. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా అత్యంత కిరాతకంగా అత్యాచారాలు చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే... ఆ అమ్మాయి తండ్రి కొద్ది రోజుల కిందట మరణించాడు. ఈ షాక్ తో తన తల్లి ముగ్గురు బిడ్డలు వదిలేసి ఎక్కడికో వెళ్లి పోవడం జరిగింది. ఆ తర్వాత తన మేనమామ వంచన చేరి ఒక విధంగా బతుకును కొనసాగిస్తున్నారు. అయితే అక్కడ ఉన్నపుడు కొందరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికను దారుణంగా రేప్ చేసి.. కిరాతకంగా చంపేయడం జరిగింది. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా లో చోటుచేసుకుంది.


ఇక పూర్తి వివరాల్లోకి వెళితే...  బాలికను అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన సయాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోవడం జరిగింది. ఉదయం పూట బహిర్భూమికు వెళ్లిన బాలికను అత్యాచారానికి గురి చేశారని స్థానికులు తెలిపారు. దుండగులు ఆ బాలికను పంట పొలాల్లోకి లాక్కొని వెళ్లి మరి దారుణంగా అత్యాచారానికి పాల్పడడం జరిగింది. ఆ తర్వాత బాలిక గొంతునులిమి అమానుషంగా హత్య చేశారు ఆ దుర్మార్గులు. 


బయటకు వెళ్లిన బాలిక ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడి వెతకడం మొదలుపెట్టారు. ఇక చివరికి పంట పొలాల్లో విగత జీవిగా పది ఉంది. ఇక బాలిక ఒంటిపై ఒక్క బట్ట కూడా లేకుండా మృతదేహాన్ని నగ్నంగా అలానే పడేసారు. బాలిక బట్టలు అన్నీ కూడా చెల్లాచెదురుగా అక్కడ పడి ఉన్నాయి. ఈ సంఘటన తెలుసుకున్న పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని... క్లూస్ టీం స్థలానికి పిలిపించి ఆధారాలు సేకరించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. నిజానికి 8వ తరగతి బాలిక పై హత్య చారం చెరగడం స్థానికులు తీవ్రంగా కలచి వేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరడం జరిగింది. అలాగే నిందితులను ఉరితీయండి అంటూ బాలిక మేనమామ డిమాండ్ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: