రోజు రోజుకి దేశంలో చిన్నచిన్నగా క్రైమ్ రేట్ పెరుగుతూ వెళుతుంది. ఒకవైపు దేశంలో ఒకవైపు కరోనాతో బాధపడుతూ ఉంటే ప్రజలు మరోవైపు హత్యలు, మానభంగాలు, ఆత్మహత్యలు ఇలా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే నేడు ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో మరో హృదయ విచారకర సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 

 


ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడి చెల్లెల్ని ప్రేమించడంతో ఈ సంఘటన సంభవించింది. తన ఫ్రెండ్ తన చెల్లెలుతో ప్రేమాయణం కొనసాగిస్తున్నారని వారిద్దరూ గొడవ పడేవారు. అయితే తన ప్రేమకు తన స్నేహితుడు అడ్డు వస్తున్నాడని స్నేహితునికి విషమిచ్చి చంపేశాడు. ఈ దారుణ సంఘటన మన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో సంభవించింది. అసలు ఏం జరిగింది అన్న విషయానికి వస్తే... ఒక యువకుడు తన స్నేహితుడి చెల్లెలిని ప్రేమించాడు. ఆ యువకుడు తన ఫ్రెండ్ కు తెలియకుండా స్నేహితుని చెల్లెలితో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు.

 


అయితే నిజం ఎన్ని రోజులు బయటికి రాకుండా పోతుంది  చెప్పండి.... చివరికి ఆ విషయం తన స్నేహితునికి తెలిసిపోవడంతో వారిద్దరి మద్ద పెద్ద ఘర్షణ జరిగింది. దీనితో తన స్నేహితునికి సదరు అమ్మాయి అన్న పలుమార్లు హెచ్చరించడం జరిగింది. దీనిని యువకుడు పట్టించుకోకపోవడంతో వారి మధ్య చాలా గొడవలు జరిగేవి. అయితే ఇక తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని ఆ అమ్మాయి అన్నని అడ్డు తొలగించాలని సదరు యువకుడు నిర్ణయం తీసుకున్నాడు. దీనితో తన స్నేహితునికి ప్రియుడు విషమిచ్చి చంపేశాడు. అమ్మాయి అన్న విషం తాగి కొన ఊపిరితో కొట్టుకుంటే అక్కడ దగ్గరలోని స్థానికులు గమనించి అతనిని ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అయితే అతను దారి మధ్యలోనే ప్రాణాలు విడిచాడు అని డాక్టర్లు తెలియజేశారు. ఇంక ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: