కొందరు భార్యాభర్తల మధ్య గొడవలతో విడిపోయినవారు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడంతో వారు ఇచ్చిన సూచనల మేరకు మళ్లీ తిరిగి జీవనం కొనసాగిస్తున్నారు. ఇది నచ్చని అమ్మాయి తమ్ముడు అక్క కాపురం బాగుంటుందని సంతోషించకుండా పగతో రగిలిపోయి అత్తమామలను పొట్టన పెట్టుకున్నాడు అతడు. అత్తమామలను ఇద్దరిని అతికిరాతకంగా హత్య చేయడం జరిగింది. ఈ దారుణమైన సంఘటన కర్ణాటక రాజధాని అయిన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. 

 

IHG

 

బెంగళూరు నగరంలోని అవనాహల్లి ప్రాంతానికి చెందిన రాకేష్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతని ఒక అక్క పవిత్రని ఆర్బిఐ లే అవుట్ ప్రాంతానికి చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నవీన్ తో 2008 సంవత్సరంలో వివాహం జరిపించారు. అయితే అక్క బావ వీరిద్దరి దాంపత్యం జీవితం సాఫీగా  కొనసాగిన కొన్ని రోజులకు మాత్రం ఇద్దరి కాపురంలో కలహాలు ఏర్పడి వారు విడిపోయారు. ఇకపోతే ఇద్దరూ కలిసి ఫ్యామిలీ కోర్టును వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు మళ్లీ ఇద్దరూ కలిసి ఒక్కటి అయ్యారు.

 


ఇది ఇలా ఉండగా... మరోవైపు అక్క బావతో కలిసి జీవనం కొనసాగించడం ఆమె తమ్ముడికి రాకేష్ కు ఎందుకో అసలు నచ్చలేదు. ఇక అప్పటికే రాకేష్ ఆ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. దీనితో అక్క అత్తమామలు అయిన గోవిందయ్య, శాంతమ్మని దారుణంగా హత్య చేశాడు. ఇక రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వచ్చిన అక్క మొగుడు నవీన్... అక్కడ శవాలుగా పడి ఉన్న వారి తల్లిదండ్రులు చూసి చలించిపోయాడు. ఇక ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించాడు అతడు. దీనితో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: