ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విరుచుక పడుతూ ఉంటే మరోవైపు హత్యలు, ఆత్మహత్యలు కలిచి వేస్తున్నాయి. అక్రమ సంబంధం ఇక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ కు చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి.. అదే గ్రామానికి చెందిన బాలమణి అనే యువతితో 2 సంవత్సరాలుగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఇతర కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో పంచాయితీ చేసారు. ఇద్దరిని మందలించి ఎవరు ఎంతకు వారు జీవనం కొనసాగించాలని వారు సూచించడం జరిగింది. ఇలా ఉండగా ఇటీవలే ఆంజనేయులు తన మేనమామ కూతురుతో వివాహం చేసేందుకు పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు.

 


ఈ విషయాన్ని ఆంజనేయులు బాలమణి కి తెలియజేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మద్యం సేవించిన సమయంలో వివాహాన్ని బాలమణి వ్యతిరేకించడం జరిగింది. దీనితో ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది. తీవ్ర ఆగ్రహానికి గురి అయిన బాలమణి కత్తి తీసుకొని ఆంజనేయులు గొంతుకోసి హత్య చేసింది. ఆ తర్వాత అతని గోనెసంచిలో కట్టి తన ఇంటికి సమీపంలో ఉన్న డ్రైనేజీలో పడేయడం జరిగింది. ఇక ఎన్ని రోజులైనా కూడా ఆంజనేయులు ఆచూకీ కనపడక పోవటంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

 


ఇకపోతే డ్రైనేజీ నుంచి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థలానికి చేరుకొని అందులో ఏముందని చూడగా ఆంజనేయులు మృతదేహం కనిపించడం జరిగింది. ఇక పోలీసులు వారి రీతిలో విచారణ చేపట్టగా అసలు విషయం బయటకు రావడం జరిగింది. అంతేకాకుండా బాలమణి కూడా తాను చేసిన తప్పుని ఒప్పుకోవడం జరిగింది. పోలీస్ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. చూశారా ఇప్పుడైన అక్రమ సంబంధాలు ఎంతవరకు దారి తీస్తాయో...!

మరింత సమాచారం తెలుసుకోండి: