మద్యం తాగవద్దని చెప్పిన కన్న తల్లిని చంపేసాడు ఒక దుర్మార్గుడు. ఇకపోతే మద్యం విషయంలో భార్యతో గొడవ పడుతూ ఉండగా మధ్యలో అడ్డు వచ్చిన కన్నకొడుకుని పొట్టన పెట్టుకున్నాడు ఈ దుర్మార్గుడు. ఈ దారుణమైన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన ఓంపాల్ అనే వ్యక్తి వ్యాపారస్తుడు నివసిస్తున్నాడు. ఈ వ్యక్తి చాలా సంవత్సరాలుగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు ఎంతగా చెప్పినా కూడా తన పద్ధతిని మాత్రం మార్చుకోలేదు ఈ దుర్మార్గులు.

 


ఇక 33 ఏళ్ల క్రితం మద్యం తాగవద్దు అని చెప్పిన కన్నతల్లినే చంపేసి శిక్ష కూడా అనుభవించి వచ్చాడు. ఇంత జరిగినా కూడా అతని ప్రవర్తన మార్చుకోని ఓంపాల్ రోజు మద్యం తాగుతూ భార్య పవిత్ర దేవితో గొడవకు దిగాడు. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ తో మద్యం దుకాణాలు అన్నీ కూడా మూతపడడంతో ఓంపాల్ ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా మళ్లీ మద్యం విక్రయాలు మొదలవడంతో ఇష్టం వచ్చినట్లు మద్యం సేవిస్తూ కుటుంబ సభ్యులను వేధించడం మొదలుపెట్టాడు.

 

 

ఇటీవల మద్యం తాగి వచ్చిన ఓం పాల్ ను భార్య పవిత్ర దేవి మందలించింది. దీనితో వారి ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. ఇక ఆ గొడవ చూసి విసిగిపోయిన కొడుకు మధ్యలో వచ్చి తండ్రితో వాదనకు దిగాడు. దీనితో ఓంపాల్ గదిలో ఉన్న లైసెన్స్ తుపాకీతో కొడుకును కాల్చి చంపడం జరిగింది. ఈ సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని తుపాకిని స్వాధీనం తీసుకోవడం జరిగింది. ఇక నిందితుడు ఓంపాల్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇందుకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు దర్యాప్తు మొదలుపెట్టారు. ఏది ఏమైనా కానీ ఇలా మద్యానికి బానిస అయ్యి కన్న తల్లిని, కన్న కొడుకుని పొట్టన పెట్టుకున్నాడు ఈ కిరాతకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: