వివాహేతర సంబంధాలు ఎక్కడికి ధరి తీస్తాయో నిదర్శనంగా నిలుస్తోందీ ఈ ఘటన. పడక సుఖం కోసం ఏకంగా కట్టుకున్న భర్తని, కన్నబిడ్డలను కూడా వదిలి వెళ్లిన మహిళ ప్రియుడితో మరో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇక ఆమెను ఆదరించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ... చివరికి ఆమె కన్నవారు సైతం ఛీ కొట్టడంతో దిక్కుతోచని స్థితిలో బావిలో దూకేసి ఆత్మహత్యా యత్నం చేసుకున్నవిషాద ఘటన తమిళనాడులో సంభవించింది.

 

కేవలం రోజుల వయస్సున్న పసికందుతో సహా ఆ తల్లి బావిలో దూకి ఆత్మహత్యా యత్నం చేసుకుంది. ఇక ఈ ఘటన కాంచీపురం జిల్లా ఉత్తిరమెరూర్ ‌లో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాలలోకి వెళితే కాంచీపురం జిల్లాకు చెందిన మహాలక్ష్మి(38) కి అదే ఏరియాకు చెందిన జగన్ ‌తో వివాహం జరిగింది. ఇకవితే ఈ జంటకు ముగ్గురు కొడుకులు సంతానం. ఇకపోతే, స్థానికంగా ఉన్న ఒక ఫ్యాక్టరీలో పనిచేసే మహాలక్ష్మి తన సహా ఉద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకుందట.

 
 
ఇలా ఆ తర్వాత ప్రియుడి మోజులో భర్త, బిడ్డలను కూడా వదిలేసి అతనితో వెళ్లిపోయింది ఆవిడ. రెండు సంవస్త్రాలుగా సహజీవనం కొనసాగించగా ప్రియుడితో గర్భం దాల్చింది. దీనితో చెంగల్ ‌పేట్ ‌లోని ఒక ఆస్పత్రిలో 12 రోజుల కిందట ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇలా ఉన్న ఆమె పసికందును తీసుకుని పుట్టింటికి చేరుకోగా ఆమెను ఛీకొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో మనస్థాపానికి గురైన మహాలక్ష్మి ఊరికి దగ్గరంలోని వ్యవసాయ బావిలో బిడ్డతో సహా దూకి ఆత్మహత్య పాల్పడింది. అయితే దీనిని గమనించిన స్థానికులు రక్షించే ప్రయత్నం చేయగా మహాలక్ష్మిని కాపాడి బయటకు తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనలో పసికందు ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ ఘటనపై ఆరా తీసి, పసికందు మరణానికి కారణమైన మహాలక్ష్మి పై మర్డర్ కేసు నమోదు చేశారు పోలీసులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: