ప్రస్తుత రోజులలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి. అలాగే వరకట్న వేధింపులతో మహిళలు చాలా మంది ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తన అత్త ఇంటి వరకట్న వేధింపులతో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.  వారు కట్నం కోసం పెట్టే అత్తింటి వేధింపులు భరించలేక ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యింది. ఈ దారుణమైన సంఘటన కర్ణాటకలోని రామనగర జిల్లా కనకాపురం పట్టణంలో చోటు చేసుకోవడం జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే...  మల్లవల్లి తాలూకకు చెందిన ఒక యువతి అదే గ్రామానికి చెందిన ముని మాధవ అనే వ్యక్తితో 2 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఆ యువకుడు కనకాపురం లోని ఒక కాలేజీలో గెస్ట్ లెక్చరర్ గా పనులు నిర్వహిస్తున్నారు.

 

 

ఇక ఇటీవల అమ్మ తన బెడ్ రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనితో ముని మాధవ పూర్ణిమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని తెలియజేశాడు. దానితో వారి తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని విగతజీవిగా పడి ఉన్న కూతుర్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు ఆ తల్లిదండ్రులు. ఇక పెళ్లి అయినప్పటినుంచి కూడా అల్లుడు అదనపు కట్నం కోసం వేధించే వాడు. అంతే కాకుండా ఇటీవల లక్ష రూపాయలు ఇవ్వకపోతే పూర్ణిమకు విడాకులు ఇచ్చేస్తానని బెదిరించాడు అని పూర్ణిమా తల్లిదండ్రులు తెలియజేశారు.  మా తల్లిదండ్రులు కష్టపడి లక్ష రూపాయలు ఇచ్చినా కూడా వారి వేధింపులు ఆగకపోవడంతో పూర్ణిమ ఆత్మహత్య చేసుకొని ఉంటుంది అని తల్లిదండ్రులు పోలీస్ అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనితో పోలీస్ అధికారులు ముని మహాదేవ అతడి అన్న పై కేసు నమోదు చేసి.. వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సంఘటనపై మరిన్ని వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: