ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి... తనదైన పాలనతో దూసుకుపోతున్నారు. ఇక మొదటి నుంచీ తన పాలనకు ఇబ్బందులు కలిగించే అధికారులను బదిలీ చేయటం తొలగించటం  చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్పు తో  సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇక మొన్నటికి మొన్న ఎన్నికలు వాయిదా వేయడంతో ఏకంగా  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కూడా బదిలీ చేస్తూ సంచలనం సృష్టించారు. పాలన విషయంలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు మేలు చేసేందుకు ముందుకు సాగడమే కాదు... తమకు ఇబ్బందులు కలిగించే అధికారులను కూడా తొలగిస్తూ వస్తున్నది  జగన్ సర్కారు.

 

 

 ఇక ఆంధ్రకు జీవనది అంటూ చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా.. మొదటి నుంచి చంద్రబాబుకు భారీ షాక్ ఇస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎవరూ ఊహించని విధంగా రివర్స్ టెండరింగ్ కు వెళ్లి విజయం సాధించారు. ఇలా పోలవరం ప్రాజెక్టు విషయంలో మొదటి నుంచి చంద్రబాబు ఊహకందని విధంగా ముందడుగు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక తాజాగా పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ మోహన్ రెడ్డి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది.

 

 

 ప్రాజెక్టు సాంకేతిక న్యాయ  సలహాదారు అయినా హెచ్కే  సాహు ని విధుల నుంచి తొలగించింది ఏపీ సర్కార్. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో ప్రాజెక్టుకు అవసరమైన సాంకేతిక న్యాయ సలహాల కోసం ఏకంగా నెలకు రెండు లక్షల వ్యయంతో... సాహో ను ఏప్రిల్ 14 2018 న కన్సల్టెంట్గా ఆనాడు అధికారంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నియమించారు. తాజాగా ఆయన పనితీరు సంతృప్తికరంగా లేదని... దీనికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు సిఈ కి నివేదిక పంపారు. దీంతో  కన్సల్టెంట్గా సాహో ని తొలగించే ప్రతిపాదనల పై ఏపీ సర్కార్ ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయం ఆంధ్ర రాజకీయాల్లో  మరోసారి సంచలనం రేపుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: