కొందరి మరణాలు ఎవరూ ఊహించని విధంగా జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ దంపతుల మరణం కూడా ఇలాగే సంభవించింది. ఏసీ కారణంగా దంపతులు మరణించిన సంఘటన అందరినీ కలిచివేసింది. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంతో నిద్రలోనే భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి  అగ్నిమాపక సిబ్బంది  చేరుకొని కిటికీ తెరిచి లోపలికి ప్రవేశించి దంపతులను బయటికి తీసుకుని రావడం జరిగింది. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్య అధికారులు తెలియచేశారు.

 


ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో తుండ్ల పరిధిలో మొహల్లా భగవాన్ ఆశ్రమం ప్రాంతంలో అజయ్, నిషా గత కొన్ని సంవత్సరాలుగా వారి జీవనం కొనసాగిస్తున్నారు. వారి జీవనం సాఫీగా కొనసాగుతుంటే.. ఏసీ వారికి  మృత్యువు రూపంలో వచ్చింది. ఉదయం నుంచి వారి ఇంటి నుంచి ఎవరు బయటికి రాకపోవడంతో అక్కడ ఉన్న స్థానికులకు అనుమానం వచ్చి పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. దీనితో ఘటనాస్థలానికి పోలీస్ అధికారులు చేరుకొని ఏసీ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది అని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడం జరిగింది. ఇక వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కిటికీలోనుంచి ఇంట్లోకి ప్రవేశించి దంపతులు ఇద్దరిని బయటికి తీసుకుని రావడం జరిగింది. 

 

హుటాహుటిగా దంపతులు ఇద్దరిని ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారణ చేయడం జరిగింది. ఏసీ సర్క్యూట్ అవ్వడంతో విష వాయువు వ్యాప్తి చెందడం వల్లనే వారు నిద్రలోనే మరణించారు అని భావిస్తున్నారు.  ప్రస్తుతానికి  మాత్రం ఏసీ ప్రమాదం కారణంగానే దంపతులు ఇద్దరు మరణించారు అని ప్రాధమికంగా నిర్ధారించడం జరిగింది. ఇక ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించేందుకు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చిన అనంతరం మరణాలపై వచ్చే అవకాశం ఉంటుంది అని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: