భారతదేశంలో రోజురోజుకి కరోనా మహమ్మారి చాపకింద నీరులా పెరుగుతూ వెళుతుంది. నేటితో దేశంలో 85 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క మహారాష్ట్రలోనే 23 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒకవైపు ఇలా ఉంటే మరోవైపు దేశంలో అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు విషయంలోకి వెళ్తే...


ప్రజలకు వైద్యం అందించాల్సిన ఒక డాక్టర్ ఒక మహిళపై అమానుషంగా ప్రవర్తించాడు. సదరు వివాహిత కడుపు నొప్పితో బాధపడుతూ ట్రీట్మెంట్ కోసం వస్తే ఆ వివాహిత పై కన్నేశాడు ఆ డాక్టర్. అంతేకాకుండా ఆమెపై రేప్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ దారుణమైన సంఘటన మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పరిధిలోని ఒక గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలోని ఒక వివాహిత కడుపు నొప్పితో ఎక్కువ బాధపడుతూ ఉండటంతో చికిత్స కోసం ఆమె గురువారం సాయంత్రం దగ్గరలోని ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్ళింది.

 

ఇక అంతటితో ఆమెకు టెస్టులు చేయాలని చెప్పిన ఆ డాక్టర్ ఆమె పక్కన వచ్చిన సహాయకులను బయటే ఉంచేసాడు. ఇక ఆ తర్వాత సదరు మహిళను పక్కనే ఉన్న గదిలోకి తీసుకు వెళ్లి తలుపులు మూసేసాడు. మెడికల్ టెస్ట్ లు పేరుతో సదరు మహిళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ ను అసభ్యంగా తాకడం మొదలు పెట్టాడు ఆ కీచక డాక్టర్. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆమె వెంటనే డాక్టర్ ను వెనక్కి నెట్టేసి అక్కడి నుంచి బయటికి పరుగులు తీసింది. ఇక ఆ విషయాన్ని ఊరిలోని పెద్దలకు చెప్పడంతో వారు వెంటనే రాజాం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. ఇక పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని నుంచి వాంగ్మూలం తీసుకొని ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో ఆ RMP డాక్టర్ పై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: