ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభంకానున్న లాక్ డౌన్ 4.0 లో పరిమితులతో కూడిన మరిన్ని సడలింపులను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసినట్టు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం తెలుస్తోంది. ఇకపోతే మరోసారి లాక్ డౌన్ పొడిగింపు తప్పనిసరి అయిన పరిస్థితుల్లో, సాధారణ పరిస్థితులు నెలకొల్పడమే లక్ష్యంగా, సడలింపులకు రూపకల్పన చేసినట్టు అధికారిక వర్గాల ద్వారా అర్ధం అవుతుంది. ఇది కేవలం కేంద్రం యొక్క సొంతం నిర్ణయం కాకుండా రాష్ట్రాలు అందించే బ్లూ ప్రింట్ ఆధారంగా, అవకాశమున్న ప్రతి ప్రాంతంలోనూ ప్రజా రవాణా తిరిగి ప్రారంభం అవుతుందని హోమ్ శాఖ ఉన్నత వర్గాల నుండి తెలుస్తోంది.

 

 

ఇక క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అందించిన తరువాతే నిర్ణయాలు ఉంటాయని, లిమిటెడ్ కెపాసిటీతో స్థానిక బస్సులు తిప్పుకోవచ్చని, హాట్ స్పాట్ ప్రాంతాల్లో మాత్రం ఈ సదుపాయం ఉండదని తెలుస్తోంది. ప్రజా రవాణా నిమిత్తం బస్సులను అనుమతించిన ప్రాంతాల్లో పాసింజర్ల సంఖ్య పై కూడా నియంత్రణలు పాటిస్తూ, ఆటోలు, టాక్సీలు నడుపుకునే అవకాశాన్ని కూడా ఇకపై అందించబోతున్నారు.

 

 

ఇక రాష్ట్రాల పరిధిలో హాట్ స్పాట్ లను నిర్ణయించుకునే అధికారం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి బదలాయించాలని చాలా మంది ముఖ్యమంత్రులు చేసిన డిమాండ్ పై సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశగా ఉన్నారు. ఇకపోతే అమలైన నిబంధనలతో పోలిస్తే, లాక్ డౌన్ 4.0 లో విభిన్నంగా ఉంటుందని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన సంగతి అందరికి తెలిసిందే. కాకపోతే కంటైన్ మెంట్ ప్రాంతాలు మినహా మిగతా అన్ని చోట్లా ఈ సడలింపులు ఉండవచ్చని అధికారుల నుండి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి.

 

ఇక అంతే కాకుండా కేసుల సంఖ్య అధికంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్ లలో జిల్లాల మధ్య ప్రయాణానికి అనుమతులు అసలు ఉండబోవని, ఇంకా కేసులు అధికంగా ఉన్న చోట్ల పరిశ్రమలు తెరిచేందుకూ వీల్లేదని కూడా వెల్లడించే సూచనలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాలు చాలా సెక్టార్లను తిరిగి తెరిపించాలని అడిగారని, అంతేకాకుండా బీహార్, ఝార్ఖండ్, ఒడిశాలు మాత్రం స్వస్థలాలకు వచ్చేస్తున్న వలస కార్మికులను దృష్టిలో ఉంచుకుని లాక్ డౌన్ ను కొనసాగించాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడిగారని సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: