దేశంలో ప్రస్తుతం ఒకవైపు కరోనా మరోవైపు దారుణాలు రోజురోజుకి పెరుగుతూ వెళ్తున్నాయి. మొదటి 2 సార్లు లాక్ డౌన్ సమయం అనగా దాదాపు 45 రోజుల వరకు దేశంలో క్రైమ్ రేట్ పూర్తిగా పడిపోయింది. అయితే ఎప్పుడైతే మూడో లాక్ డౌన్ మొదలైందో దేశంలో కొన్ని పరిస్థితులు అదుపుతప్పాయి. ఇక ప్రస్తుత రోజుల్లో ఘోరాలు, అత్యాచారాలు చాలా ఎక్కువ అయ్యాయి. అంతే కాకుండా కొన్ని అక్రమ సంబంధాలు పండంటి కాపురాన్ని సర్వ నాశనం చేస్తున్నాయి. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు బాగా ఉన్న కాపురాలు సర్వ నాశనం అయిపోతున్నాయి. భార్య కానీ, భర్త కానీ వేరు వేరు వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడంతో హత్యలు, ఆత్మహత్యలు చాలా ఎక్కువ అయిపోతున్నాయి. 

 


ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. వారి పూర్తి వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా రేపల్లెలో సౌజన్య అనే అమ్మాయి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంతో హత్యకు గురి అవ్వడం జరిగింది. కట్టుకున్న భర్తే తనను దారుణంగా హత్య చేశాడు. గత అర్థరాత్రి సౌజన్య పై భర్త వీరేంద్ర కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వీరేంద్ర కూడా పురుగుల మందు తాగి... స్థానిక పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోవడం జరిగింది. పోలీస్ అధికారులు వీరేందర్ ను అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి తరలించడం జరిగింది.

 


ప్రస్తుతం వీరేంద్ర తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల సహాయంతో చికిత్స పొందుతున్నాడు.  తన భార్య సౌజన్య భైరవ అనే వ్యక్తితో ఆ విధంగా ఉండడం చూసి భరించలేక హత్య చేశానని వీరేంద్ర తెలియచేశాడు. ఇక పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు. అలాగే భైరవుడు కూడా అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సౌజన్య మృతదేహం పోస్టుమార్టం నిర్వహించేందుకు ఆసుపత్రికి తరలించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: