వైఎస్ఆర్సిపి ఫైర్ బ్రాండ్ రోజా ఒకవైపు బుల్లితెరపై మరోవైపు రాజకీయాల్లో కూడా చాలా సక్సెస్ఫుల్ గా రాణిస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఉన్న టైంలో ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల అందరితో ఆడిపాడింది. బడా బడా హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా రోజా ఓ వెలుగు వెలిగింది. ఆ తరువాత రాజకీయ రంగంలో అడుగుపెట్టిన రోజా తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాణించింది. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు గా రోజా కి చంద్రబాబు పదవి ఇవ్వటంతో అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలపై రోజా సీరియస్ విమర్శలు చేస్తూ వార్తల్లో కీలకంగా రాణించింది. ముఖ్యంగా 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో పవన్ కళ్యాణ్ ని చిరంజీవి ని చెడుగుడు ఆడుకున్న సందర్భాలు ఉన్నాయి.
అయితే ఆ సమయంలో టీడీపీ లో ఉన్న నాయకులు మరియు పెద్దలు రోజాకి ఆమె సొంత నియోజకవర్గం నగరిలో వెన్నుపోటు రాజకీయాలు చేయడం తో ఆమె ఓటమి పాలు అవ్వడం జరిగింది. ఆ తర్వాత అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరింది. అయితే వైఎస్ చనిపోవటం తర్వాత రాష్ట్రం విభజన జరగటంతో వైయస్ జగన్ పార్టీ వైసీపీ పార్టీలో చేరి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా టిడిపి నాయకులను మరియు ఇతర పార్టీల నాయకులను ఏకిపారేసి అసెంబ్లీలో సైతం దూకుడు చూపించిన రోజా తాజాగా ఇంటర్నెట్లో ఆమె చేస్తున్న ఎక్సర్సైజ్ వీడియోలతో దడ దడ పుట్టిస్తున్నారు. డంబెల్స్తో సునాయాసంగా ఎక్సర్సైజ్ చేస్తూ చెమట చిందిస్తున్నారు.
ఎలాంటి అలసట లేకుండా , వేగంగా డంబెల్స్తో ఆమె ఎక్సర్సైజ్ చేయడం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. మోచేతులపై శరీరాన్ని మొత్తం తిప్పుతూ ఒక్క నిమిషం పాటు అలాగే ఉన్న రోజా.. "వన్ మినిట్ ప్లాంక్ ఛాలెంజ్ నేను చేశా. మరి మీరు" అంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసి సవాల్ విసిరారు. చాలా మంది అభిమానులు వై సీపీ మద్దతుదారులు రోజా వీడియో కి కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది మళ్ళీ హీరోయిన్ గా ట్రై చేస్తున్నారా అంటూ ఆటపట్టిస్తున్నారు.