ప్రియురాలి కోసం ఓ ప్రియుడు ప్రియురాలిని అతి కిరాతకంగా చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. అతనికి నో చెప్పిందని ఉన్న వాళ్లందరినీ చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ప్రియురాలి మాటలు విని సొంత కుటుంబాన్నే హతమార్చాడో కిరాతకుడు. తల్లిదండ్రులు, అక్క, భార్యను సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించాడు. ఏమీ ఎరుగనట్లు పోలీసులకు తానే ఫిర్యాదు చేశాడు. తీగ లాగితే డొంక కదిలినట్లు అసలు సూత్రధారి అతడేనని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం అంగీకరించాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.. 

 

 

 

 

 

 

తన కుటుంబసభ్యులను ఎవరో హత్య చేసినట్లు ఆతీష్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ఆతీష్‌పై అనుమానం మొదలైంది. అతడిపై నిఘా పెట్టడంతో రంజన శుక్లా అనే యువతితో అక్రమ సంబంధం బయటపడింది. వీరి కాల్స్‌డేటాను పరిశీలించిన పోలీసులకు అసలు నిజం తెలిసింది. ఆతీష్‌ ఆస్తిపై కన్నేసిన రంజన శుక్లా అందరినీ చంపేస్తే మనిద్దరం హాయిగా ఎంజాయ్ చేయొచ్చంటూ ఉసిగొల్పింది. దీంతో అతడు తన తల్లిదండ్రులు, భార్య, సోదరిని చంపేందుకు కిరాయి హంతకుడు అనుజ్ శ్రీవాస్తవతో రూ.8లక్షల ఒప్పందం చేసుకున్నాడు.

 

 

 

 

 

 

అనుకున్న ప్లాన్ ప్రకారం అనుజ్ అతని అనుచరలతో కలిసి అతీష్ కుటుంబాన్ని అతి కిరాతకంగా నరికి చంపేశారు..పోలీసులు విచారించగా అసలు నిజం బయటకు వచ్చింది దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.. అలాగే ఆతీష్, అతడి ప్రియురాలు రంజన శుక్లాతో పాటు హంతకులు అనుజ్ శ్రీవాస్తవ, అతడి సహాయకుడు ఉమేంద్ర ద్వివేదిని అరెస్ట్ చేశారు. ఈ హత్యలు దొంగల పనిగా తప్పుదోవ పట్టించేందుకు అనుజ్ ఆ ఇంటి నుంచి రూ.లక్ష నగదు, ఓ మొబైల్ ఫోన్ దొంగించాడు. వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: