ఈ మధ్యకాలంలో ఆన్లైన్ ప్రేమలు ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే.. గుర్తుతెలియని వ్యక్తులతో సోషల్ మీడియా వేదికగా పరిచయం ... ఆ తర్వాత మాటలు కలవడం... పరిచయం కాస్త ప్రేమగా మారడం. చివరికి నట్టేట మునిగిపోవడం... ఇలాంటి ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలునే టార్గెట్ చేస్తున్న కొంతమంది దుర్మార్గులు అమ్మాయిలతో పరిచయం పెంచుకొని మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకుని ఆ తర్వాత నట్టేట ముంచుతున్నారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న చాలా ఘటనలు ఇలాంటివే. 

 

 

 తాజాగా ఇలాంటి ఓ ఘటనే మరోసారి జరిగింది. ఈ మధ్యకాలంలో టిక్ టాక్ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. టిక్ టాక్ లో సంభాషణలు చేసుకోవడానికి కూడా వీలు ఉండడంతో... చాలామంది ఈ  టిక్ టాక్  ద్వారా పరిచయం ఏర్పడుతుంది. టిక్ టాక్ లో మొదలైన పరిచయాలు ఎక్కడి వరకొ  దారి తీస్తున్నాయి. ఇక్కడ టిక్ టాక్ లో మొదలైన ప్రేమ చివరికి అత్యాచారంతో ముగిసింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పాతబస్తీ కి చెందిన ఓ యువతికి గత ఏడాది డిసెంబర్లో తలాబ్ కట్ట ప్రాంతానికి అక్బర్ షా  అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. 

 

 

కాగా సదరు వ్యక్తికి  అప్పటికే పెళ్లయి నలుగురు పిల్లలు ఉన్నప్పటికీ ఈ విషయంలో దాచి తనకు పరిచయమైన  యువతిని  ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు.. ఇక ఆ యువతికి మాయమాటలు చెప్పి టోలిచౌకి  లోని ఆ వ్యక్తి యొక్క సోదరి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఉత్పత్తి నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతని జాడే లేకుండా పోయింది. దీంతో బాధితురాలు మోసపోయానని గ్రహించి చంద్రయనగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: