మద్యం మనిషిని రాక్షసుడిగా మారుస్తుంటుంది . మద్యం లోపలికి వెళ్ళిన తర్వాత మనిషి అసలు మనిషి అన్న విషయాన్ని కూడా మర్చిపోతుంటారు కొన్నిసార్లు. ఇక మద్యం మత్తులో తీసుకున్న నిర్ణయాలు కాస్త ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. మామూలుగానే మద్యం మత్తులో విచక్షణ లేకుండా ఉంటారు మందు బాబులు. ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు ప్రాణాల మీదికి తెస్తూ ఉంటాయి. ఇక్కడ ఓ వ్యక్తి అలాంటిదే చేశాడు. తాజాగా మద్యానికి బానిస అయిపోయిన ఓ వ్యక్తి తన అత్త మందలించిందనే  కారణంతో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. 

 

 

 మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతున్నాడు అని అల్లుడుని  అత్త కాస్త మందలించింది. ఏదైనా పని చేసుకుని పెళ్ళాన్ని  చూసుకోవాలి అంటూ హితవు పలికింది. అప్పటికి మద్యం మత్తులో తూగుతున్న ఆ వ్యక్తికి అత్త మాటలు ఎంతగానో బాధ కలిగించాయి. దీంతో తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తపేట మండలం రాకుర్తివారిపాలానికి చెందిన ఆకుమర్తి విజయ్ కృష్ణ ప్రసాద్ బెల్లంపూడి గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి 2017 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. 

 

 

 ఇక ఆ తర్వాత భార్యతో కలిసి అత్తారింట్లో లోనే ఉంటూ ఇల్లరికపు అల్లుడుగా  అక్కడే సెటిలైపోయాడు విజయ్ కృష్ణ. అయితే మొన్నటి వరకు లాక్ డౌన్  సమయంలో కూడా ఏదో ఒక పని చేసుకొని కుటుంబ పోషణకు తోడ్పాటు గా నిలిచేవాడు విజయ్ కృష్ణ ప్రసాద్. కానీ ఎప్పుడైతే మద్యం షాపులు తెరుచుకున్నాయో  ఆ రోజు నుండి మద్యం తాగడం మొదలు పెట్టాడు. పనికి వెళ్లడం పూర్తిగా మానేశాడు. ఫుల్లుగా తాగడం ఊర్లో  జులాయిగా తిరగడం మొదలుపెట్టాడు. ఇక ప్రవర్తన మార్చుకోవాలని భార్య ఎంత చెప్పినా వినక పోవడంతో... అత్త అల్లుడుని  తీవ్రంగా మందలించింది. ఏదైనా పని చేసుకునే భార్యని పోషించుకోవాలంటూ హితవు  పలకడంతో తీవ్ర మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తర్వాత రోజు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: