మహిళ ల రక్షణ కోసం ఎన్నో చట్టా లను ప్రభుత్వం అమలు చేస్తున్న కూడా కామాంధు ల రాక్ష సత్వాన్ని తీర్చు కుంటున్నారు.. పసికందుల నుంచి పండు ముస లాల్ల వరకు వదలకుండా కామ దాహాన్ని తీర్చు కుంటున్నారు..పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎందరో చని పోయారు.. నిర్భయ ,దిశ లాంటి ఎన్నో చట్టా లను అమలు లోకి తీసుకొచ్చిన కూడా మగ మృగళ ల్లో ఎటువంటి మార్పు రాలేదు.. 

 

 

 

తూర్పు జిల్లా లో ఈ ఘటన వెలుగు చూసింది..ఇంట్లో ఒంటరి గా ఉన్న ఏడేళ్ల బాలిక పై ఓ యువకుడు(23) అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన సీతానగరం మండలం లోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు మూడు రోజుల కిందట సీతానగరం లోని ఈ గ్రామంలో ఉండే తన పెద్దమ్మ ఇంటికి వచ్చాడు. వారి ఇంటి పక్కనే ఓ కుటుంబం నివసిస్తోంది. వారికి ఏడేళ్ల కుమార్తె ఉంది.

 

 

 

 

ఆ బాలికపై కన్నేసిన యువకుడు తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లోకి దూరి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కోరుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులతో పాటు స్థానికులు పీఎస్ ఎదుట కాసేపు ఆందోళన చేపట్టారు. కోరుకొండ డీఎస్పీ పీఎస్‌ఎన్‌ రావు, సీఐ పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు గ్రామానికి చేరి వివరాలు సేకరించారు. యువకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, బాలికను వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.పోలీసులకు విషయం తెలిసిందని తెలుసుకున్న యువకుడు అక్కడ నుంచి పరారయ్యారు.. స్పెషల్ టీమ్ సాయంతో వేతికిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: