ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి. ఇక ఇలాంటి వాటిలో గుప్త నిధుల వేట ఒక్కటి. ఇక గుప్త నిధుల పేరుతో ఒక వ్యక్తి బాలికపై దారుణానికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన సంఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని రుద్ర సముద్రానికి  చెందిన రామాంజనేయులు వారి ఇంట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక గుంటూరుకు చెందిన విషువర్ధన్ రోగాలు నయం చేసేందుకు తాయెత్తులు కడుతూ జీవనం కొనసాగించేవాడు. ఇటీవల విషువర్ధన్, రామాంజనేయులు వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. 


ఇక ఈ తరుణంలోనే రామాంజనేయులు గ్రామంలోని కొందరు తాయతులు కట్టేందుకు రావాలి అని విష్ణువర్ధనుని కోరడం జరిగింది. అందుకు అనుమతించి విష్ణువర్ధన్ ఒక ఇంట్లో బస ఏర్పాటు చేయడం జరిగింది. ఇక బస చేసిన ఇంటి యజమాని కుమార్తె పై విష్ణువర్ధన్ కన్నేసాడు. అంతేకాకుండా ఈ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అంటూ అందరినీ నమ్మించడం జరిగింది. బాలికతో పూజలు నిర్వహిస్తే వాటిని బయటికి తీయవచ్చును అని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇంకేం ఉంది వారు నిజమేనని నమ్మి ఇంటి యజమాని పూజలకు ఏర్పాటు చేయడం జరిగింది. 


ఇక గదిలోకి వెళ్ళిన తర్వాత పూజల పేరుతో విష్ణువర్ధన్ బాలికపై దారుణానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే గ్రామస్తులు విష్ణువర్ధన్ రుద్ర పూజలు చేస్తున్నాడని అనుమానంతో అతడిని అనుమానించడం జరిగింది. దీనితో గ్రామస్తులు అందరూ కలిసి హర్షవర్ధన్ నిలదీయగా అసలు నిజం బయటకు వచ్చింది. బాలికపై అత్యాచారం చేసినట్లు అతడు ఒప్పుకోవడం జరిగింది. ఇక విష్ణువర్ధన్ కి గ్రామస్తులు అందరూ కూడా దేహశుద్ధి చేసి పోలీసు అధికారులకు సమాచారం అందించారు. దీనితో పోలీస్ అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. కాబట్టి ఇలాంటి విషయాలకు ఎంత దూరంగా ఉంటె అంత మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: